అమరావతి : ప్రపంచ బ్యాంకు సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఆదివారం ఏపీ సర్కార్ కు తీపికబురు చెప్పింది. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు చేపట్టేందుకు గాను ఏకంగా ప్రపంచ బ్యాంకు 340 మిలియన్ డాలర్లను విడుదల చేసింది. ఈ సందర్బంగా ఏపీ సీఎస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్లో రెండు సంస్థల ప్రపంచ బ్యాంకు , ఏడీబీ) నుండి మాకు మరో 130-150 మిలియన్ డాలర్లు అందనున్నాయని వెల్లడించారు. అమరావతి రాజధాని మొదటి దశ అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు ఇప్పటివరకు 340 మిలియన్ డాలర్లను విడుదల చేసిందని అంతర్జాతీయ ఆర్థిక సంస్థకు చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఏప్రిల్ చివరి నాటికి ఆంధ్రప్రదేశ్కు మరో 150 మిలియన్ డాలర్లు అందే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
కాగా వడ్డీ రేటు సుమారు 8 నుండి 8.5 శాతం వరకు ఉంటుందని, అంతర్జాతీయ రేట్లను బట్టి ఇది మారుతూ ఉంటుందని ఆ అధికారి పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుతో కలిసి అమరావతి రాజధాని మొదటి దశ అభివృద్ధికి 1,600 మిలియన్ డాలర్లను (ఒక్కొక్కదానికి 800 డాలర్లు) కేటాయించాయి. ప్రపంచ బ్యాంకు, ఏడీబీలతో పాటు, కేంద్రం కేటాయించిన 15,000 కోట్ల రూపాయలలో 1,400 కోట్ల రూపాయలను సమకూరుస్తుంది. ప్రపంచ బ్యాంకు ఏప్రిల్ 2026 నాటికి 340 మిలియన్ డాలర్లను విడుదల చేసింది. ఏఐయూడీపీ (అమరావతి సమీకృత పట్టణాభివృద్ధి కార్యక్రమం) ‘ప్రోగ్రామ్ ఫర్ రిజల్ట్స్’ ఫ్రేమ్వర్క్ కింద ఇది అమలు చేయబడుతోంది.
