న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. తాను చేసిన వ్యాఖ్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. అది ఆమె స్వంత అభిప్రాయం మాత్రమేనని పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని ఒక ప్రైవేట్ మీడియా సంస్థ అయిన ‘ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఆసియా’ నిర్వహించింది.షేక్ హసీనా జాతీయ రాజధానిలో నిర్వహించిన మీడియా సమావేశంలో తమకు ఎలాంటి పాత్ర లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ విలేకరుల సమావేశాన్ని ఒక ప్రైవేట్ మీడియా సంస్థ స్వతంత్రంగా నిర్వహించిందని పునరుద్ఘాటించింది. మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలకు భారత్ మద్దతు ఇవ్వదని నొక్కి చెప్పారు.
ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదు. ఆ వేదికపై చెప్పిన ఏ అంశానికీ, ముఖ్యంగా బంగ్లాదేశ్ యొక్క చట్టబద్ధమైన ప్రభుత్వం విషయంలో చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం మద్దతు ఇవ్వదు అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించింది 2024లో బంగ్లాదేశ్ విడిచిపెట్టిన తర్వాత షేక్ హసీనా మొదటిసారిగా మీడియాను ఉద్దేశించి మాట్లాడారు; న్యూఢిల్లీ నుండి ఆమె నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశం నేపథ్యంలో ఈ స్పష్టత వచ్చింది. ఆ సమావేశంలో, ఎదురయ్యే ప్రమాదాలను లెక్క చేయకుండా ఈ ఏడాది చివరలో తన స్వదేశానికి తిరిగి రావాలనే దృఢ నిశ్చయాన్ని ఆమె వ్యక్తం చేశారు. నాకు ఎలాంటి విధి ఎదురైనా సరే, నేను నా ప్రజల వద్దకు తిరిగి వస్తాను.నా ప్రియమైన దేశ ప్రజలు బాధపడుతుంటే నేను దూరంగా ఉండలేను. డిసెంబర్లో తిరిగి వెళ్లాలనుకుంటున్నాను అని ఆమె అన్నారు.
















