Thalapathy Vijay Speech : ద‌ళ‌ప‌తి స్పీచ్ అదుర్స్

హింస కంటే అహింశ గొప్ప‌ది

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు త‌మిళ సినీ న‌టుడు ద‌ళ‌ప‌తిగా పిలుచుకునే జోసెఫ్ విజ‌య్. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌ను న‌టించిన లియో బిగ్ స‌క్సెస్ గా నిలిచింది. ఇదే స‌మ‌యంలో భారీ ఎత్తున ఈ సినిమాకు సంబంధించి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఈ సంద‌ర్బంగా చెన్నై వేదిక‌గా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో విజ‌య్ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఎంతో ప‌రిణ‌తి చెందిన నాయ‌కుడిగా త‌ను వివ‌ర‌ణ ఇచ్చారు. ఇందుకు సంబంధించి వైర‌ల్ గా మారారు ద‌ళ‌ప‌తి.

చాలా సున్నితంగా త‌న‌లోని మ‌న‌సులోని మాట‌ల‌ను పంచుకున్నారు. సినిమాను సినిమా లాగా మాత్ర‌మే చూడాల‌ని సూచించాడు. తాను కానీ, ద‌ర్శ‌కులు కానీ, త‌న‌తో న‌టించే న‌టులు కానీ చిత్రంగానే చూస్తామ‌ని స్ప‌ష్టం చేశాడు. స‌క్సెస్ అయ్యిందా లేదా అన్న‌ది తాను ప‌ట్టించు కోనంటూ స్ప‌ష్టం చేశాడు విజ‌య్.

నేను మీ కోస‌మే ఉన్నా. న‌న్ను మీ గుండెల్లో పెట్టుకున్నారు. అంత‌కంటే ఎక్కువ‌గా ఆద‌రిస్తున్నారు. నేను మీకు స‌దా రుణ‌ప‌డి ఉన్నాన‌ని అన్నారు. నా నుంచీ మీరు ఏమీ కోరుకోవ‌డం లేదు. ఇందుకు నేను ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని చెప్పారు.

న‌న్ను మ‌న్నించండి. మీ మ‌న‌సులో గాయ‌మైతే. మ‌హాత్ముడు చెప్పిన‌ట్టు హింస కంటే అహింస గొప్ప‌ది..అత్యంత శ‌క్తివంత‌మైన‌ద‌ని. ద‌య‌చేసి అర్థం చేసుకోండి. లియోను విజ‌యవంతం చేసినందుకు థ్యాంక్స్ అన్నారు విజ‌య్.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com