Sushila Karki : నేపాల్ : నేపాల్ దేశంలో రాజకీయ పరంగా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ దేశానికి చెందిన మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పేరు పొందిన సుశీలా కర్కిని (Sushila Karki) తాత్కాలికంగా ప్రధానమంత్రిగా నియమించారు. ఈ విషయాన్ని అధికారికంగా నేపాల్ ఆర్మీ చీఫ్ వెల్లడించారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా వర్చువల్ గా ఎవరిని ప్రధానిగా నియమించాలనే దానిపై సమావేశం నిర్వహించారు. ఇందులో దేశానికి చెందిన 5 వేల మంది యువతీ యువకులు పాల్గొన్నారు. వారంతా మూకుమ్మడిగా సుశీలా కర్కిని నియమించాలని కోరారు. ఇదిలా ఉండగా ఆమె వయసు 72 ఏళ్లు. చీఫ్ జస్టిస్ గా పని చేసిన తొలి మహిళగా నేపాల్ చరిత్రలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నారు.
Sushila Karki As a Nepal Interm PM
ఇప్పుడు ఉపసంహరించ బడిన సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనల తరువాత, దేశ తాత్కాలిక ప్రభుత్వ అధిపతిని ఎన్నుకోవడానికి వర్చువల్ సర్వే చేపట్టారు. అత్యున్నత పదవికి సాధ్యమయ్యే అభ్యర్థులపై ఆన్లైన్ చర్చ దృష్టి సారించింది. ఖాట్మండు మేయర్ బాలెన్ షాను మొదట్లో ఇష్టమైన వ్యక్తిగా భావించినప్పటికీ, తనను సంప్రదించడానికి పదేపదే చేసిన ప్రయత్నాలకు స్పందించ లేదని పాల్గొనేవారు తెలిపారు. తమ పిలుపులను ఆయన స్వీకరించ కపోవడంతో, చర్చ ఇతర పేర్లకు మారింది. ఎక్కువ మద్దతు సుశీలా కర్కికి పోయిందని జెడ్ ప్రతినిధి వెల్లడించారు. సుశీలా కర్కికి మద్దతుగా 2000కు పైగా సంతకాలు చేశారు. వర్చువల్ సర్వేలో కర్కితో పాటు బాలెన్ షా, కుల్మాన్ ఘిసింగ్ , సాగర్ దకల్ , హర్కా సంపాంగ్ లు ఉన్నారు.
Also Read : CM Fadnavis Warning : శివాజీ నగర్ పేరుమార్పుపై మహారాష్ట్ర–కర్ణాటక తగువులు


















