Stock Market : దేశీయ మార్కెట్లలో శుభవార్తలు వరుసగా వెలువడుతున్న నేపథ్యంలో సూచీలు బలంగా లాభాలు నమోదుచేశాయి. రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల కనిష్టానికి చేరుకోవడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందిన నేపథ్యంలో మార్కెట్లు (Stock Market) ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.
ఇక ప్రస్తుతం రాజకీయ, భౌగోళిక పరిణామాలు కూడా మదుపర్లకు హరీష్ సంకేతాలుగా మారాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ల భేటీపై వార్తలు వెలువడుతున్నాయి. అంతేగాక, రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి శాంతి దారులు కనిపించనున్నాయని సంకేతాలు రావడంతో మార్కెట్లకు అదనపు బలమయ్యింది.
Stock Market – మార్కెట్ లేటెస్ట్ అప్డేట్:
మంగళవారం ముగింపు (80,235)తో పోల్చితే, బుధవారం ఉదయం సెన్సెక్స్ 250 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ను ప్రారంభించింది. ట్రేడింగ్ మొదటి నుండి చివరి వరకు లాభాల్లోనే కొనసాగింది. ఓ దశలో 450 పాయింట్ల లాభంతో 80,683 స్థాయిని తాకిన సెన్సెక్స్, చివరకు 304 పాయింట్లు పెరిగి 80,539 వద్ద ముగిసింది.
నిఫ్టీ కూడా అదే బాటలో కొనసాగి, చివరికి 131 పాయింట్ల లాభంతో 24,619 వద్ద స్థిరపడింది.
లాభాల్లో ఉన్న షేర్లు:
సెన్సెక్స్లో అపోలో హాస్పిటల్స్, భారత్ డైనమిక్స్, బీఎస్ఈ లిమిటెడ్, నైకా, హిందాల్కో షేర్లు మదుపర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. మరోవైపు, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఎస్జేవీఎన్, సుజ్లాన్ ఎనర్జీ, ఆయిల్ ఇండియా, ఎల్ఐసీ ఇండియా షేర్లు నష్టాల్లో కదలాడాయి.
ఇతర సూచీలు & రూపాయి విలువ:
నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 356 పాయింట్ల లాభాన్ని నమోదు చేయగా, బ్యాంక్ నిఫ్టీ 137 పాయింట్లతో బలపడింది. డాలర్తో పోల్చితే భారత రూపాయి మారకం విలువ ప్రస్తుతం 87.71గా ఉంది.
మొత్తానికి, అంతర్జాతీయ స్థాయిలో సానుకూల వాతావరణం, దేశీయంగా ద్రవ్యోల్బణం తగ్గిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు మరింత ఊపు దిశగా పయనిస్తున్నాయి.
Also Read : Stock Market Shocking : నష్టాలతో ముగిసిన ఈక్విటీ సూచీలు


















