South Central Railway : పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. కాజీపేట–చర్లపల్లి మీదుగా పట్నాకు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది జనవరి 2 వరకు ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.
South Central Railway – ప్రత్యేక రైళ్ల వివరాలు
- 03253 పట్నా–చర్లపల్లి ప్రత్యేక రైలు: అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతి సోమవారం, బుధవారం నడుస్తుంది.
- 07255 చర్లపల్లి–పట్నా ప్రత్యేక రైలు: అక్టోబర్ 3 నుంచి జనవరి 2 వరకు ప్రతి బుధవారం నడుస్తుంది.
- 07256 చర్లపల్లి–పట్నా ప్రత్యేక రైలు: అక్టోబర్ 3 నుంచి జనవరి 2 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది.
ఆగే స్టేషన్లు
ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్, బల్లార్షా, నాగ్పూర్, గోందియా, దుర్గ్, రాయ్పూర్, బిలాస్పూర్, ఝార్సుగూడ, రూర్కెలా, హతియా, రాంచి, బొకారో స్టీల్ సిటీ, గోమోహ్, కొడెర్మా, గయా, జెహనాబాద్ స్టేషన్లలో ఆగుతాయని రైల్వే శాఖ ప్రకటించింది.
ప్రయాణికుల సౌకర్యం కోసం తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే పండుగ సీజన్లో ప్రయాణాల ఒత్తిడిని తగ్గించనుందని రైల్వే అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read : Cement Price Drop : నేడు భారీగా తగ్గిన సిమెంట్ ధరలు


















