Romila Thapar : ఢిల్లీ : ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశానికి ఎందరో మేధావులను, పనిమంతులను, సామాజివకవేత్తలను అందించిన జవహర్ లాల్ విశ్వ విద్యాలయం ఇవాళ అచేతనావస్థకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పని గట్టుకుని ఇప్పటినుంచే కాదని గత 10 సంవత్సరాలుగా కొనసాగుతూనే వస్తుందని వాపోయారు. పూర్తిగా నాశనమైందన్నారు రొమిల్లా థాపర్ (Romila Thapar).
మేధో పరమైన ఉద్దేశ పూర్వక విద్యకు స్వేచ్ఛతో కూడిన ఆలోచన అవసరం అని అభిప్రాయపడ్డారు. ఈ నియంత్రణ మేధో వ్యతిరేకతకు ప్రబలంగా ఉన్న ప్రాధాన్యతకు మరొక నిదర్శనమా? మాటను నిశ్శబ్దం చేయవచ్చు, కానీ ఆలోచనను నిశ్శబ్దం చేయలేమని పేర్కొన్నారు.
Romila Thapar Shocking Comments on Jawaharlal Nehru University
జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం, ఇతర సామాజిక శాస్త్ర కేంద్రాలు గత కొన్నేళ్లుగా నష్ట పోయాయని, వాటి స్థాపనలో పాల్గొన్న వారు ఈ నాశనానికి భయపడుతున్నారని చరిత్రకారిణి రోమిలా థాపర్ అన్నారు. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన మూడవ కపిల వాత్స్యాయన్ స్మారక ఉపన్యాసంలో ప్రసంగించారు. యూనివర్శిటీలో విద్యా ప్రమాణాలను నిర్వహించడం చాలా సమస్యాత్మకమైనదని అన్నారు. 1970లలో యూనివర్శిటీని స్థాపించడంలో పాల్గొన్న మనలో కొందరు గత పది సంవత్సరాలలో జరిగిన విధ్వంసం చూసి దిగ్భ్రాంతి చెందారన్నారు. ఇతర బలమైన సామాజిక శాస్త్ర కేంద్రాలు కూడా నష్ట పోయాయని వాపోయారు. గత దశాబ్దంలో విద్యా ప్రమాణాలను నిర్వహించడం చాలా సమస్యాత్మకంగా మారిందన్నారు.
Also Read : AP High Court Shocking : ఏపీ కౌన్సిల్ చైర్మన్ కు హైకోర్టు జరిమానా
















