Rajinikanth : సినీ అభిమానులకు ఆశ్చర్య పోయేలా కీలక అప్ డేట్ ఇచ్చాడు దమ్మున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్. 46 సంవత్సరాల తర్వాత ఇద్దరు దిగ్గజ నటులు కలిసి నటిస్తుండడం విశేషం. ఆ ఇద్దరు ఎవరో కాదు తమిళనాడు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ఒకరు కమల్ హాసన్ కాగా ఇంకొకరు రజనీకాంత్ (Rajinikanth). తను ఇటీవలే కూలీ మూవీలో నటించారు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో శ్రుతి హాసన్ , సోబేన్, సత్య రాజ్, అక్కినేని నాగార్జున, పూజ, తదితరులు నటించారు. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కమల్ హాసన్ , రజనీతో కలిసి సినిమా తీయాలన్నది దర్శకుడి కోరిక. ఈ విధంగా తన డెసిషన్ ప్రకటించాడు.
Rajinikanth-Kamal Haasan Combination
సుదీర్ఘ విరామ కాలం తర్వాత ఈ ఇద్దరు దిగ్గజ నటులు కలిసి నటించ బోతుండడం విశేషం. మరోసారి కొత్త సినిమా కోసం తిరిగి జత కట్టబోతున్నారు. ఈ ఇద్దరి యాక్టర్స్ కు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తమిళనాడులో, ఈ ఇద్దరు స్టార్ల అభిమానులు విడుదలైన మొదటి రోజునే తమ సినిమాలు చూడటానికి పని నుండి సెలవు తీసుకుంటారు. వారి అభిమానులు ఎంత అంకితభావంతో ఉన్నారో ఇది చూపిస్తుంది, ఇదంతా స్టార్ల అద్భుతమైన నటనా నైపుణ్యాలకు ప్రతీక. కొంతకాలంగా రజనీకాంత్ , కమల్ హాసన్ ఒక సినిమా కోసం జత కట్టబోతున్నారని పుకార్లు వ్యాపించాయి.
ఈ పుకార్లను చివరకు కమల్ హాసన్ స్వయంగా ధృవీకరించారు, ఇటీవల దుబాయ్లో జరిగిన సైమా 2025 అవార్డుల కార్యక్రమంలో కీలక ప్రకటన చేశారు. తన మనసులోని మాటను బయట పెట్టారు. 46 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ సహకారం, ఈ ప్రాజెక్ట్ కోసం అంచనాలను ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి పెంచింది. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండడంతో రాబోయే మూవీపై మరింత అంచనాలు ఉత్కంఠను రేపుతున్నాయి.
Also Read : Popular Director RGV Rangeela : ఆర్జీవీ రంగీలాకు 30 ఏళ్లు : ఊర్మిళ



















