హైదరాబాద్ : విజయపుర జిల్లాలోని పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షా కేంద్రంలో నిరసనలు జరిగిన నేపథ్యంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాత పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ అభ్యర్థులు పరీక్షా కేంద్రం నుండి బయటకు వచ్చి, తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ నియామక రాత పరీక్షలో లోపాలు జరిగాయన్న వివాదం, ఓఎంఆర్ షీట్ , ప్రశ్నపత్రం బుక్లెట్ సీరియల్ నంబర్ల విషయంలో కొంతమంది అభ్యర్థులకు కలిగిన అపార్థం వల్లే తలెత్తిందని కర్ణాటక హోం మంత్రి స్పష్టం చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ మంత్రి ఇలా అన్నారు: ఓఎంఆర్ సీరియల్ నంబర్ , ప్రశ్నపత్రం సీరియల్ నంబర్ ఒకేలా ఉండాలని అభ్యర్థులలో కొంత అపార్థం లేదా తప్పుడు అభిప్రాయం ఏర్పడిందన్నారు.
అది అవసరం లేదు, అలాగే మేము ఎక్కడా అలా నిర్దేశించలేదు. కేవలం కొద్దిమంది మాత్రమే అది అవసరమని భావించి బయటకు వచ్చారు; ఒకసారి బయటకు వెళ్తే తిరిగి లోపలికి రాలేరని మేము చెప్పినప్పటికీ వారు అలా చేశారన్నారు హోం శాఖ మంత్రి. తమ చర్య సరైనది కాదని గ్రహించిన తర్వాత, వారు తిరిగి లోపలికి రావాలని కోరారు. కానీ నిబంధన ప్రకారం, ఓఎంఆర్ షీట్లతో ప్రాంగణం విడిచి వెళ్ళిన తర్వాత తిరిగి లోపలికి రావడానికి వీలుండదు. కాబట్టి, దీని గురించి ఏమి చేయవచ్చో చూద్దాం అని ఖర్గే అన్నారు. నిరసనకారులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న ప్రశ్నకు స్పందిస్తూ హోం మంత్రి ఇలా అన్నారు. పరీక్షలు సజావుగా సాగాలంటే ఇలా చేయక తప్పదన్నారు ఖర్గే.

















