President Murmu Tirumala Important Visit : శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి

చిత్ర ప‌టం, ప్ర‌సాదాన్ని అందించిన ఈవో

Hello Telugu - President Murmu Tirumala Important Visit

Hello Telugu - President Murmu Tirumala Important Visit

President Murmu : తిరుమ‌ల :తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని శుక్రవారం భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము దర్శించుకున్నారు. ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరిన ఆమె తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ భూ వరహ స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్ర‌ప‌తికి టిటిడి ఛైర్మ‌న్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సాదరంగా అహ్వానించారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజ స్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు.

President Murmu Visited Tirumala

ఆమె వెంట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఉన్నారు.అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ముకు (President Murmu) ఆచార్యులు, పూజారులు వేదాశీర్వచనం చేశారు. ఛైర్మ‌న్‌, ఈవో శ్రీవారి చిత్ర పటాన్ని తీర్థ ప్రసాదాలను, టీటీడీ 2026 క్యాలెండర్, డైరీలను రాష్ట్రపతికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జానకి దేవి, భాను ప్రకాష్ రెడ్డి, సీవీఎస్వో మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ఇతర జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు.

Also Read : Harish Rao Fired on Congress Govt : సిగాచి బాధితుల ప‌రిహారం ఏమైంది..?

Exit mobile version