PM Modi : ఢిల్లీ – ప్రధాన మంత్రి నరేంద్ర ఎంపీల కోసం తయారైన ఫ్లాట్లను ప్రారంభిస్తారు. సోమవారం ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, బాబా ఖరక్ సింగ్ మార్గ్లో పార్లమెంటు సభ్యుల (ఎంపీ) కోసం కొత్తగా నిర్మించిన 184 ఫ్లాట్లతో కూడిన 27 అంతస్తుల భవనం ముస్తాబైంది. ప్రధాని (PM Modi) ఈ నివాస సముదాయంలో ఒక సింధూర మొక్కను నాటి, నిర్మాణ కార్మికులతో మాట్లాడతారని పీఎంఓ తెలిపింది.
PM Modi Inaugurates
ఈ కాంప్లెక్స్లో 184 టైప్-VII ఫ్లాట్లు ఉన్నాయి, ఒక్కో ఫ్లాట్ 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో ఐదు బెడ్రూమ్లు, ఎంపీలు, వారి సహాయకుల కోసం ప్రత్యేక కార్యాలయాలు, సహాయక సిబ్బంది కోసం రెండు అదనపు గదులు ఉంటాయి. ఇతర సౌకర్యాలలో పవర్ బ్యాకప్, అగ్నిమాపక వ్యవస్థలు, సమీకృత నిర్మాణాత్మక భద్రతా లక్షణాలు, ఇంధన సామర్థ్యంతో కూడిన గ్రీన్ బిల్డింగ్ డిజైన్ వంటివి ఉన్నాయి.
ఒక అధికారిక ప్రభుత్వ ప్రకటనలో ప్రతి నివాస యూనిట్ నివాస, అధికారిక కార్యకలాపాలకు సరిపడా స్థలాన్ని అందిస్తుంది. కార్యాలయాలు, సిబ్బంది వసతి, ఒక కమ్యూనిటీ సెంటర్ కోసం ప్రత్యేక స్థలాలు ఉండటం వల్ల ఎంపీలు ప్రజల ప్రతినిధులుగా తమ బాధ్యతలను నిర్వర్తించడంలో సహాయ పడుతుంది అని పేర్కొంది.
గ్రీన్ టెక్నాలజీని ఇందులో చేర్చారు. ఈ ప్రాజెక్ట్ GRIHA 3-స్టార్ రేటింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంది , నేషనల్ బిల్డింగ్ కోడ్ (NBC) 2016కి లోబడి ఉంది. ఈ పర్యావరణ అనుకూల లక్షణాలు ఇంధన పొదుపు, పునరుత్పాదక శక్తి ఉత్పత్తి, సమర్థవంతమైన వ్యర్థ పదార్థాల నిర్వహణకు దోహదం చేస్తాయని స్పష్టం చేసింది. ఈ భవనాలు భూకంపాలను తట్టుకునేలా నిర్మించబడ్డాయి. సమగ్ర, పటిష్టమైన భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ భవనాలను రూ. 550 కోట్ల ఖర్చుతో నిర్మించారు.
Also Read : CM Revanth Reddy-Heavy Rains Sensational : వరద ప్రాంతాలను పరిశీలించిన సీఎం
















