న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గత మే నెలలో నీట్ యుజి 2026 పరీక్షను చేపట్టింది. రాజస్తాన్ లో పేపర్ లీక్ అయ్యింది. దీంతో నీట్ పరీక్షను రద్దు చేసింది. ఈ నెల జూన్ 21న తిరిగి పరీక్ష నిర్వహిస్తామని ఎన్టీఎస్ ప్రకటించింది. ఇప్పటికే కేంద్ర సర్కార్ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. దర్యాప్తులో బీజేపీకి చెందిన నాయకుడితో పాటు ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు, ప్రొఫెసర్ రూ. 10 లక్షలకు పేపర్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దీంతో పూర్తిగా రద్దు చేసి తిరిగి నిర్వహించాలని ఆదేశించింది సర్కార్. ఇందులో భాగంగా పరీక్ష నిర్వహణకు సంబంధించి 15 నిమిషాలు అదనపు సమయం పొడిగించినట్లు ప్రకటించింది. ఈ పరీక్షను ఇక నుంచి ఆన్ లైన్ ఆధారంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.
ఇదిలా ఉండగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇవాళ నీట్ యుజి పరీక్ష కోసం విద్యార్థులకు అనుకూలమైన పలు చర్యలను ప్రకటించింది; ఇందులో అదనపు రఫ్-వర్క్ (చిత్తు పని) స్థలం , పొడిగించిన పరీక్షా సమయం ఉన్నాయి. ఈ వైద్య ప్రవేశ పరీక్ష జూన్ 21న జరగాల్సి ఉంది. ఎన్టీఏ ప్రకారం, పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు జరుగుతుంది, తద్వారా మొత్తం 195 నిమిషాల సమయం లభిస్తుంది. పరీక్ష వ్యవధిని 15 నిమిషాలు పెంచారు. పరీక్ష ప్రారంభంలో, ముగింపులో సంతకాలు చేయడం వంటి పర్యవేక్షణ ప్రక్రియల కోసం ఈ సమయం కేటాయించినట్లు స్పష్టం చేసింది.
గతంలో ఇవి తమ అసలు పని సమయాన్ని తగ్గిస్తున్నాయని అభ్యర్థులు భావించేవారు అని ఏజెన్సీ పేర్కొంది. ప్రశ్నపత్రం బుక్లెట్లో రఫ్-వర్క్ కోసం అందించే పేజీల సంఖ్యను కూడా రెండు నుండి నాలుగుకు రెట్టింపు చేసింది, దీనివల్ల అభ్యర్థులకు గణనలు , విశ్లేషణల కోసం అదనపు స్థలం లభిస్తుంది.
