ఢిల్లీ : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ఆట తీరుపై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. ఈ సందర్బంగా అదే రాష్ట్రానికి చెందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ముందు నుంచి క్రికెట్ ప్రేమికుడు. ఆయనకు శాంసన్ అంటే వల్లమాలిన అభిమానం. తనకు బేషరతుగా మద్దతు ఇస్తూ వచ్చాడు. తాజాగా కోల్ కతా వేదికగా జరిగిన కీలకమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో విండీస్ పై భారత జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంలో కీలకమైన పాత్ర పోషించాడు కేరళ క్రికెటర్ శాంసన్. తను 50 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు 4 సిక్సర్లతో 97 రన్స్ చేశాడు. చివరి దాకా ఉంటూ ఇండియాను గెలుపు తీరాలకు చేర్చాడు. ఈ సందర్బంగా శశి థరూర్ స్పందించాడు. ఆయన ప్రశంసల జల్లులు కురిపించాడు సంజూ శాంసన్ ఆట తీరుపై.
గతంలో ఎదురైన ఎదురు దెబ్బల కారణంగా అతను జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడని నేను అతని కోసం బాధపడ్డాను. ఈరోజు అతను ప్రపంచానికి మొదటి స్థానంలో ఉండటానికి ఎందుకు అర్హుడో చూపించాడు. తిరువనంతపురంలో జన్మించిన కుమారుడు, భారతదేశ గర్వ పడేలా ఆడాడని పేర్కొన్నాడు శశి థరూర్. సెలక్షన్ వైఫల్యాలు, పరిమిత అవకాశాల దశల్లో సోషల్ మీడియాలో కేరళ బ్యాటర్కు తరచుగా మద్దతు ఇచ్చే థరూర్ చాలా కాలంగా సామ్సన్కు అత్యంత స్వర మద్దతుదారులలో ఒకడుగా ఉన్నారు. మ్యాచ్ గెలిచిన తర్వాత , భారతదేశం విజయాన్ని జరుపుకుంటుండగా, థరూర్ ఆనందం వ్యక్తం చేయడం వైరల్ గా మారింది. శాంసన్ ఇన్నింగ్స్ను సంవత్సరాలుగా తన ప్రతిభపై స్థిరంగా చూపిన విశ్వాసానికి ధృవీకరణగా అభివర్ణించారు ఎంపీ.


















