ED Shocking – MLA KC Veerendra Arrest : కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర‌ అరెస్టు

దాడుల్లో రూ. 12 కోట్ల నగదు, ఆభ‌ర‌ణాలు స్వాధీనం

Hello Telugu - ED Shocking - MLA KC Veerendra Arrest

Hello Telugu - ED Shocking - MLA KC Veerendra Arrest

KC Veerendra : క‌ర్ణాట‌క – క‌ర్ణాట‌క కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర‌ను అదుపులోకి తీసుకుంది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ. రూ. 12 కోట్ల న‌గ‌దుతో పాటు రూ. 6 కోట్ల విలువైన ఆభ‌రణాలు స్వాధీనం చేసుకున్నారు. 5 క్యాసినోలను కేసీ వీరేంద్ర క‌లిగి ఉన్నార‌ని తెలిపారు. కెసి వీరేంద్రను (KC Veerendra) శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ అరెస్టు జరిగింది. వీరేంద్ర‌ ఆస్తులపై ఈడీ దాడులు నిర్వహించింది. రూ. 1 కోటి విలువైన విదేశీ కరెన్సీతో పాటు నాలుగు వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంది. కెసి వీరేంద్ర కర్ణాటకలోని చిత్రదుర్గ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. గోవాలో క్యాసినో వ్యాపారంలో ఎమ్మెల్యేకు వాటాలు ఉన్నాయని సమాచారం.

Karnataka MLA KC Veerendra Arrest

ఆయనకు ప్రసిద్ధ పాపిస్ క్యాసినోతో సహా దాదాపు ఐదు క్యాసినోలు ఉన్న‌ట్లు గుర్తించింది ఈడీ. ఇందుకు సంబంధించి ఈడీ ఫోటోల‌ను విడుద‌ల చేసింది. కెసి వీరేంద్ర క్రెడిట్ కార్డులు, ఇతర పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. కెసి వీరేంద్ర పేరు మీద నమోదు చేయబడిన మెర్సిడెస్ కారును కూడా దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది. గత ఎనిమిది రోజుల్లో క‌ర్ణాట‌క‌లోని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌పై ఆరా తీసింది. అంతకు ముందు, ఆగస్టు 14న కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ కృష్ణ సైల్ ఇంటి నుండి ఈడీ రూ. 1.41 కోట్ల‌ను స్వాధీనం చేసుకుంది. కుటుంబ సభ్యుల బ్యాంకు లాకర్ల నుండి 6.75 కిలోల బంగారు ఆభరణాలు, బిస్కెట్లను కూడా ఏజెన్సీ స్వాధీనం చేసుకుంది.

Also Read : Sahasra Murder – Boy Killed : క్రికెట్ బ్యాట్ కోస‌మే స‌హ‌స్ర హ‌త్య : సీపీ

Exit mobile version