Maoists Encounter : దళపతి నంబాల కేశవరావు, అనేక మంది సీనియర్ నేతలను ఎన్కౌంటర్లలో కోల్పోయిన మావోయిస్టులకు మరోసారి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ కార్యదర్శి గాజర్ల రవి (Ravi) అలియాస్ ఉదయ్ బుధవారం ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఈ ఘటనలో మరో అగ్ర నాయకురాలు రావి వెంకటగిరి చైతన్య అలియాస్ అరుణ (54) (Aruna) మరియు నక్సలైట్ అంజూ కూడా ప్రాణాలు కోల్పోయారు. చలపతి అనే పేరుతో ప్రసిద్ధుడైన రాంచంద్రారెడ్డి భార్య అరుణ ఈ ఎన్కౌంటర్లో మృతిచెందింది.
Maoists Encounter in Maredumilli
ఉదయ్ 2004లో మావోయిస్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పుడు కీలక సభ్యుడిగా పాల్గొన్నారు. 2026 మార్చి 31లోగా మావోయిస్టులను పూర్తిగా అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సహకారంతో ‘ఆపరేషన్ కగార్’ను ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఒడిశా అడవుల్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో, ఉదయ్ బృందం నెల క్రితం అల్లూరి జిల్లాలోకి ప్రవేశించింది.
ఈ సమాచారం ఆధారంగా ఏపీ (AP) గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు ముమ్మరం చేశాయి. మూడుసార్లు ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న ఉదయ్, అరుణ చివరికి బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించారు. కాకురి పండన్న అలియాస్ జగన్, కోరాపుట్ డీసీఎం రమేశ్ కూడా చనిపోయారు. మావోయిస్టులు ఈ నెల 20న బంద్ పిలుపునిచ్చారు. గ్రేహౌండ్స్ డ్రోన్ల సాయంతో ఉదయ్ బృందాన్ని గుర్తించి, మంగళవారం రాత్రి వ్యూహాత్మకంగా రంగంలోకి దిగాయి. దేవీపట్నం మండలంలోని ఆకూరు, కొయ్యలగూడెం సరిహద్దులోని అటవీప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మూడు ఏకే-47లు స్వాధీనం చేసుకున్నారు.
గాజర్ల రవి నాలుగు దశాబ్దాలు మావోయిస్టు ఉద్యమంలో (Maoists Encounter) గణేశ్, ఉదయ్ పేర్లతో పనిచేశారు. 1980ల్లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ద్వారా ఉద్యమంలోకి వచ్చారు. 1990లో పీపుల్స్వార్ పార్టీలో చేరి, జిలానీ బేగం అనే మావోయిస్టును వివాహం చేసుకున్నారు. ఆమె ఎన్కౌంటర్లో మరణించింది. 2004లో ప్రభుత్వం చర్చలకు అంగీకరించినప్పుడు ఆయన కీలక సభ్యుడిగా ఉన్నారు. బాకూర వెంకటరమణ అలియాస్ గణేశ్ మృతి అనంతరం ఏవోబీ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన స్వస్థలం తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల. ఆయన కుటుంబంలో ముగ్గురు మావోయిస్టు ఉద్యమంలో చేరారు. అన్నయ్య గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ ఎన్కౌంటర్లో చనిపోగా, మరో అన్నయ్య గాజర్ల అశోక్ అలియాస్ ఐతు పోలీసులకు లొంగిపోయారు. ఉదయ్ తలపై తెలంగాణలో రూ.40 లక్షలు, ఏవోబీలో రూ.25 లక్షల రివార్డు ఉంది.
అలిపిరి ఘటనలో చంద్రబాబుపై జరిగిన బాంబు దాడిలో, తాడిమెట్ల ఘటనలో 76 మంది జవాన్ల హత్యలో, బలిమెల ఘటనలో ఉదయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 2018లో అరకు లోయలో టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యకు అరుణే స్కెచ్ వేసిందని పోలీసులు తెలిపారు. అరుణ విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెంకు చెందినవారు. ఆమె తండ్రి లక్ష్మణరావు మాజీ మావోయిస్టు నేత కాగా, తల్లి లత, తమ్ముడు ఆజాద్ ఎన్కౌంటర్లలో మరణించారు. అరుణ భర్త చలపతి కూడా ఈ ఏడాది జనవరిలో ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆమెపై రూ.20 లక్షల రివార్డు ఉంది. అంజూ వివరాలు అందుబాటులో లేవు.
2004లో వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో జరిగిన చర్చల్లో మావోయిస్టు నాయకులు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ, చలం అలియాస్ సుధాకర్, గాజర్ల రవి అలియాస్ ఉదయ్, జనశక్తి నాయకులు రియాజ్, దేవేందర్ అలియాస్ అమర్ పాల్గొన్నారు. ఇప్పుడు ఆ బృందంలో అమర్ మాత్రమే జీవితం కొనసాగిస్తున్నారు.
Also Read : CM Revanth Reddy Controversial : రాజకేయాలకతీతంగా బానకచర్ల ప్రాజెక్ట్ కోసం అన్ని పార్టీలు కలిసి రావాలి


















