Jairam Ramesh : ఢిల్లీ : వక్ఫ్ చట్టంలోని కీలక నిబంధనలను నిలిపి వేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ న్యాయ విజయంగా అభివర్ణించింది . ఈ తీర్పు చట్టంలోని దుర్మార్గపు ఉద్దేశాలను రద్దు చేస్తుందని, వక్ఫ్ ఆస్తులను సందేహాస్పదమైన సవాళ్ల నుండి రక్షిస్తుందని ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ జైరాం రమేష్ (Jairam Ramesh) అన్నారు. ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్బంగా స్పందించారు జైరాం. (సవరణ) చట్టం 2025లోని వివాదాస్పద నిబంధనలను నిలిపి వేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దీనిని పార్లమెంటులో భిన్నాభిప్రాయాలను సమర్థించడం ,రాజ్యాంగ విలువలకు రక్షణగా అభివర్ణించారు.
Jairam Ramesh Shocking Comments on Supreme Court Verdict
న్యాయం, సమానత్వం, సోదరభావం అనే రాజ్యాంగ విలువలకు విజయంగా వక్ఫ్ (సవరణ) చట్టంలోని అనేక కీలక నిబంధనలను నిలిపి వేయడం ఆహ్వానించ దగిన పరిణామమని పేర్కొన్నారు. వక్ఫ్ (సవరణ) చట్టం 2025పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు పార్లమెంటులో ఈ ఏకపక్ష చట్టాన్ని వ్యతిరేకించిన పార్టీలకు మాత్రమే కాకుండా, వివరణాత్మక అసమ్మతి నోట్లను సమర్పించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యులందరికీ గణనీయమైన విజయాన్ని సూచిస్తుందని అన్నారు. వాటిని అప్పుడు విస్మరించారు కానీ ఇప్పుడు అవి నిరూపించబడ్డాయని అన్నారు. ఈ ఉత్తర్వు ముఖ్యమైనది. ఎందుకంటే ఇది అసలు చట్టంలోని దుష్ట ఉద్దేశాలను రద్దు చేయడానికి చాలా దూరం వెళుతుందన్నారు.
కేంద్రం కావాలని కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని నిర్ణయాలు తీసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు జైరాం రమేష్. సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పు, చేసిన వ్యాఖ్యల గురించి ప్రధాని, ఆయన పరివారం ఆలోచించాలని సూచించారు.
Also Read : MLA Harish Rao Warning : పచ్చటి పొలాల్లో చిచ్చు పెడితే ఊరుకోం















