Jagdeep Dhankhar : న్యూఢిల్లీ – భారత దేశ ఉప రాష్ట్ర పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు జగదీప్ ధంఖర్. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. తీవ్రమైన అనారోగ్య కారణాల రీత్యా తనకు ప్రస్తుతం విశ్రాంతి అవసరమని భావిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ సమయం పార్లమెంట్ సమావేశాలకు ఇవ్వలేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యమని తనకు వైద్యులు సలహాలు ఇచ్చారని, ఆ మేరకు తాను పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు జగదీప్ ధంఖర్.
Vice President Jagdeep Dhankhar Resign
కాగా తన రాజీనామా వెంటనే అమలులోకి వస్తుందని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ) ప్రకారం సమర్పించడం జరిగిందన్నారు. జగదీప్ ధంఖర్ (Jagdeep Dhankhar) గత 2022 వ సంవత్సరం నుంచి భారత ఉప రాష్ట్రపతిగా పని చేస్తున్నారు. ఆయన గతంలో 2019 నుండి 2022 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పని చేశారు. రాజ్యసభ చైర్మన్ కూడా అయిన 74 ఏళ్ల జగ్దీప్ ధంఖర్ పదవీకాలం 2027 వరకు ఉంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటి రోజున ఆయన రాజీనామా చేశారు.
తన పదవీకాలంలో మద్దతు ఇచ్చినందుకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంటు సభ్యులకు జగ్దీప్ ధంఖర్ ఒక లేఖలో ప్రగాఢ కృతజ్ఞతలు తెలిపారు . మన గొప్ప ప్రజాస్వామ్యంలో ఉపాధ్యక్షుడిగా నేను పొందిన అమూల్యమైన అనుభవాలు, అంతర్దృష్టులకు నేను చాలా కృతజ్ఞుడను. ఈ ముఖ్యమైన కాలంలో భారతదేశంకు సంబంధించిన అద్భుతమైన ఆర్థిక పురోగతి, అపూర్వమైన అభివృద్ధిని చూడటం, పాల్గొనడం ఒక గౌరవం, సంతృప్తినిచ్చింది. మన దేశ చరిత్రలోని ఈ పరివర్తన యుగంలో సేవ చేయడం నిజమైన గౌరవం అని ధంఖర్ లేఖలో పేర్కొన్నారు.
Also Read : CM Revanth Reddy Warning : కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

















