Israel : ఇజ్రాయెల్ : ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు. గాజాను లక్ష్యంగా చేసుకుని అటాక్ చేస్తూనే ఉంది. తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో చిన్నారులు కూడా ఉన్నారు. గాజా నగరంలో ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడి నుండి అనేక ఎత్తైన భవనాలను ధ్వంసం చేసింది. పాలస్తీనియన్లను ఖాళీ చేయమని కోరింది. మృత దేహాలను తీసుకు వచ్చిన షిఫా హాస్పిటల్ కు తరలించారు . మృతుల్లో 12 మంది పిల్లలు ఉన్నారు. ఓవైపు హాహాకారాలు కొనసాగుతున్నా ఇంకో వైపు దాడుల పరంపరను ఆపడం లేదు ఇజ్రాయెల్ (Israel). గాజా నగరం అంతటా మరింత ముమ్మరం చేసింది ఇజ్రాయెల్. హమాస్ వాటిలో నిఘా పరికరాలను ఉంచిందని ఆరోపించింది.
Israel Attack on Gaza
గాజా భూభాగంలోని అతిపెద్ద నగరాన్ని స్వాధీనం చేసుకునే లక్ష్యంతో దాడిలో భాగంగా, హమాస్ చివరి బలమైన కోటగా చెబుతున్న ఈ దాడిలో భాగంగా నివాసితులను వదిలి వెళ్ళమని ఆదేశించింది. లక్షలాది మంది ప్రజలు అక్కడే ఉండి, కరువు పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నారు. ఉన్నట్టుండి అర్ధరాత్రి దాడికి దిగింది ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఇజ్రాయెల్. తెల్లవారుజామున జరిగిన దాడుల్లో ఒకటి షేక్ రాడ్వాన్ పరిసరాల్లోని ఒక ఇంటిని తాకింది. ఈ ఘటనలో ఓ మహిళ, ముగ్గురు పిల్లలతో పాటు 10 మంది కుటుంబీకులు మరణించారని ఆరోగ్య అధికారులు వెల్లడించారు.
అల్-హెలాల్ స్పోర్టింగ్ క్లబ్ ఆటగాడు మొహమ్మద్ రమేజ్ సుల్తాన్, అతని కుటుంబంలోని 14 మంది సభ్యులతో పాటు ఈ దాడుల్లో మరణించారని పాలస్తీనియన్ ఫుట్బాల్ అసోసియేషన్ తెలిపింది.
Also Read : Asaduddin Owaisi Fired on IND vs PAK : 26 మంది ప్రాణాల కంటే మ్యాచ్ ముఖ్యమా..?

















