Indian Govt Interesting Updates : మరో 2 ఏళ్లలో ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధ కేంద్రాలు

ఈ నిర్ణయం సెప్టెంబర్‌ 10, 2025 నుంచి అమల్లోకి వచ్చింది.

Hello Telugu - Indian Govt Interesting Updates

Hello Telugu - Indian Govt Interesting Updates

Indian Govt : దేశవ్యాప్తంగా చౌకైన జనరిక్‌ మందులు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం (Indian Govt) కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో నగరాలు, అధిక జనసాంద్రత కలిగిన పట్టణాల్లో కొత్త జన ఔషధి కేంద్రాలను ప్రారంభించడానికి అమల్లో ఉన్న కనీస దూర నియమాన్ని రద్దు చేసినట్లు ఇండియన్‌ మెడిసిన్స్‌ అండ్‌ మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ బ్యూరో (PMBI) ప్రకటించింది. ఈ నిర్ణయం సెప్టెంబర్‌ 10, 2025 నుంచి అమల్లోకి వచ్చింది.

Indian Govt – ప్రభుత్వ లక్ష్యం:

మార్చి 31, 2027 నాటికి దేశవ్యాప్తంగా 25,000 కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం దేశంలో సుమారు 17,000 జన ఔషధి కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో 2,047 మందులు, 300 శస్త్రచికిత్సా పరికరాలు సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి.

నిబంధన సడలింపు ప్రభావం:

అయితే, గత రెండు సంవత్సరాలలో కొత్తగా ప్రారంభమైన కేంద్రాల సమీపంలో కొత్త దుకాణాలను స్థాపించాలంటే, రెండు సంవత్సరాలు పూర్తయ్యే వరకు దూర నిబంధన కొనసాగుతుంది. మిగిలిన నగరాలు, పట్టణాల్లో మాత్రం ప్రస్తుతం ఉన్న 1 కిలోమీటర్‌ నియమం అమల్లోనే ఉంటుంది.

ప్రజలకు లాభాలు:

ప్రభుత్వ ప్రోత్సాహకాలు:

ప్రధాన్‌ మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన (PMBJP) కింద కొత్త కేంద్రాలు నెలవారీగా రూ.20,000 వరకు ప్రోత్సాహకాలు పొందవచ్చు. అదనంగా రూ.2 లక్షల వరకు ఒకేసారి ఆర్థిక సహాయం అందుతుంది. మందుల నాణ్యతను నిర్ధారించడానికి WHO-GMP ప్రమాణాలు అనుసరించే కంపెనీల నుంచే ఔషధాలను కొనుగోలు చేస్తారు. అన్ని కేంద్రాలు ఫార్మాస్యూటికల్‌ డిపార్ట్‌మెంట్‌ అనుమతితోనే నడుస్తాయి.

Also Read : Retail Inflation Warning : ఆగస్టులో రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరుగుదల – 2.07%కి ఎగసింది

Exit mobile version