India Post : దేశవ్యాప్తంగా పోస్టాఫీస్ సేవలను మరింత వేగవంతం చేయడానికి భారత ప్రభుత్వానికి చెందిన ఇండియా పోస్ట్ పెద్దఎత్తున సాంకేతిక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో రూ.5,800 కోట్ల విలువైన అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ (APT) ని ఇటీవల అధికారికంగా ప్రారంభించింది.
India Post Interesting Update
ఈ ఆధునిక టెక్నాలజీ అమలుతో పార్శిల్లు మరియు లెటర్లను రియల్ టైమ్లో ట్రాక్ చేసే అవకాశం కలుగుతుంది. ఇదే కాకుండా, వినియోగదారులు ఎటువంటి బ్యాంక్ అకౌంట్నుంచి అయినా UPI చెల్లింపులు చేయగలిగే విధంగా సేవలు విస్తరించబడ్డాయి. ఈ మార్పు గ్రామీణ ప్రాంతాలకు సైతం డిజిటల్ సేవలను చేరవేసే దిశగా పెద్ద అడుగుగా భావించబడుతోంది.
ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, “ఇండియా పోస్ట్ (India Post) తరఫున దేశవ్యాప్తంగా అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీని ప్రారంభించడం నాకు గర్వకారణం. ఇది భారతదేశ డిజిటల్ మార్గంలో చారిత్రాత్మక ముందడుగు,” అని తెలిపారు.
APT వేదిక పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేయబడినది. ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా మరియు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల నుండి ప్రేరణ పొందింది. ఈ కొత్త వ్యవస్థ సాంకేతికత ఆధారంగా రియల్ టైమ్ నిర్ణయాలను తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది.
ఇండియా పోస్ట్లో ఈ సాంకేతికత ప్రవేశంతో ఇ-కామర్స్ సేవలు మరింత విస్తరించే అవకాశముంది. అలాగే ఆటోమేషన్ ద్వారా కార్యాచరణ వ్యయాలను తగ్గించడమే కాక, వినియోగదారులు ఎక్కడ నుండైనా, ఎప్పుడైనా పోస్ట్ ఆఫీస్ సేవలను సులభంగా పొందగలగనున్నారు.
ఈ చర్యల ద్వారా ఇండియా పోస్ట్ను ప్రపంచస్థాయి పబ్లిక్ లాజిస్టిక్స్ సేవల సంస్థగా మారుస్తామన్న ఆశాభావాన్ని కేంద్రం వ్యక్తం చేసింది. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య తేడాను తగ్గిస్తూ, అంతర్గత సమాచార వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇది కీలక భూమిక పోషించనుంది.
Also Read : Indian Railways Shocking : ఇకపై రైళ్లల్లో కూడా దిమ్మతిరిగే నిబంధనలు



















