Hindustan : ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో అనేక వస్తువులపై పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ వినియోగ ఉత్పత్తుల కంపెనీ హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) తన కీలక ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
Hindustan – సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చే ఈ కొత్త ధరల ప్రకారం:
- డవ్ షాంపూ (340 మి.లీ. బాటిల్) – రూ. 435
- హార్లిక్స్ (200 గ్రాములు) – పాత ధర రూ. 130, కొత్త ధర రూ. 110
- కిసాన్ జామ్ (200 గ్రాములు) – పాత ధర రూ. 90, కొత్త ధర రూ. 80
- లైఫ్బాయ్ సబ్బులు (75 గ్రాముల నాలుగు ప్యాక్) – పాత ధర రూ. 68, కొత్త ధర రూ. 60
HUL తెలిపిన ప్రకారం, కొత్త ధరలు లేదా కొంచెం పెద్ద ప్యాక్లతో స్టాక్ క్రమంగా మార్కెట్లోకి వస్తుంది. అయితే చిన్న సాచెట్ల ధరల్లో మార్పు ఎలా అమలు చేస్తారన్న విషయంలో ఇంకా స్పష్టత అవసరం ఉందని కంపెనీ పేర్కొంది.
జీఎస్టీ తగ్గింపుతో వినియోగదారులకు కొంత ఊరట లభించనుంది. ముఖ్యంగా రోజువారీ ఉపయోగంలో ఉండే షాంపూ, సబ్బులు, పానీయాలు, ఫుడ్ ప్రొడక్ట్స్ వంటి వస్తువులు చౌకగా లభించనున్నాయి.
Also Read : Myanmar Air Strike Sensational : మయన్మార్లో జుంటా వైమానిక దాడి – 19 మంది విద్యార్థుల మృతి


















