GST : న్యూఢిల్లీ – గత 5 ఆర్థిక సంవత్సరాల్లో రూ.7.08 లక్షల కోట్ల జీఎస్టీ (GST) ఎగవేత గుర్తించడం జరిగింది. 2020-21 నుండి 2024-25 వరకు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో 91,370 కేసుల్లో పన్ను అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ.7.08 లక్షల కోట్ల మేర వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) ఎగవేత గుర్తించ బడిందని సోమవారం పార్లమెంటుకు సమాచారం అందింది. ఈ ఐదు సంవత్సరాలలో గుర్తించబడిన 44,938 కేసుల్లో ఐటీసీ మోసం ఎగవేత మొత్తంలో రూ.1.79 లక్షల కోట్లు ఉన్నాయి. ఈ ఐదు సంవత్సరాల కాలంలో స్వచ్ఛంద డిపాజిట్ల ద్వారా వసూలు చేయబడిన జీఎస్టీ మొత్తం రూ.1.29 లక్షల కోట్లకు పైగా ఉంది.
GST Evasion Updates
2024-25 ఆర్థిక సంవత్సరంలో, సీజీఎస్టీ ఫీల్డ్ అధికారులు రూ.2.23 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ ఎగవేతను కనుగొన్నారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో సమర్పించిన డేటా చూపించింది. 2024-25లో గుర్తించబడిన 30,056 జీఎస్టీ ఎగవేత కేసుల్లో, సగానికి పైగా లేదా 15,283 కేసులు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) మోసానికి సంబంధించినవి, ఇందులో మొత్తం రూ.58,772 కోట్లు ఉన్నాయని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, పన్ను అధికారులు గుర్తించిన జీఎస్టీ ఎగవేత రూ.2.30 లక్షల కోట్లు, అందులో ఐటీసీ మోసం రూ.36,374 కోట్లుగా ఉందని వెల్లడించారు.
2023-24లో, దాదాపు రూ.1.32 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత కనుగొనబడింది, ఇందులో రూ.24,140 కోట్లు ఐటీసీ మోసం జరిగిందని పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, గుర్తించబడిన జీఎస్టీ ఎగవేత రూ. 73,238 కోట్లుగా ఉంది, అందులో ఐటీసీ మోసం రూ. 28,022 కోట్లు కాగా, 2021-22లో జీఎస్టీ ఎగవేత రూ. 49,384 కోట్లు కాగా, ఐటీసీ మోసం రూ. 31,233 కోట్లుగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనా లో నికర సీజీఎస్టీ వసూళ్లు 96.7 శాతం ఉన్నాయని మంత్రి చెప్పారు.
Also Read : Ferdanand Marcos Interesting Comments : ఇండియాతో ఫిలిప్పీన్స్ కు విడదీయని బంధం


















