Gold : బంగారం ధరలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. భారత్లో బంగారం ధరలు లక్ష దాటిపోవడంతో ప్రజలు కొనుగోలుకు వెనుకంజ వేస్తుంటే, పక్క దేశం పాకిస్థాన్లో అయితే పరిస్థితి మరింత తీవ్రమైంది. అక్కడ బంగారం ధర 10 గ్రాములకు రూ. 3,50,000 దాటిపోయింది. ఈ సంఖ్య విని చాలామంది “ఇంత రేటుకి ఎవరు బంగారం కొంటారు?” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
Gold Price Updates
భారత్లో మహిళలు బంగారం (Gold) పట్ల చూపే మమకారం ఎంతగానో తెలిసిన విషయం. అలానే పాకిస్థాన్లో కూడా మహిళలు బంగారు నగలు ధరించడాన్ని ఆభరణంగా కాకుండా గౌరవప్రతీకంగా భావిస్తారు. ఈ సాంస్కృతిక సంప్రదాయం కారణంగా అక్కడ కూడా బంగారానికి భారీ డిమాండ్ కొనసాగుతోంది.
తాజా రేట్ల ప్రకారం, అక్టోబర్ 5న పాకిస్థాన్లో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 34,962, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 32,048, 18 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 26,221గా నమోదైంది. అంటే పది గ్రాముల బంగారం ధర రూ. 3.5 లక్షలు దాటింది.
పాకిస్థాన్లో బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది పెట్టుబడి రూపంగానూ, వివిధ సంప్రదాయాలు, వివాహాలు, పండుగలలో అంతర్భాగంగానూ నిలుస్తుంది. ఈ కారణంగా దేశంలోని బంగారం మార్కెట్ ఎప్పుడూ చురుకుగానే ఉంటుంది.
ప్రస్తుతం పాకిస్థాన్లో బంగారం ధరలను పెట్టుబడిదారులు, వినియోగదారులు, ఆర్థిక నిపుణులు నిశితంగా గమనిస్తున్నారు. ఈ ధరలు దేశ ఆర్థిక స్థిరత్వానికి, అలాగే ప్రపంచ విలువైన లోహాల మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలకు కీలక సూచికలుగా మారాయి.
Also Read : Bitcoin Huge Record : బిట్కాయిన్ దూకుడు: చరిత్రలోనే కొత్త గరిష్టానికి చేరిన క్రిప్టో కింగ్


















