YS Jagan : అమరావతి – మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) నిప్పులు చెరిగారు సీఎం చంద్రబాబు నాయుడుపై. చంద్రబాబు ప్రజలను మోసం చేయడం లో ఆరి తేరాడని అన్నారు. గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు. సీరియస్ కామెంట్స్ చేశారు. మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేక పోతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారని తాను అనుకోలేదన్నారు. మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్ల పాటు రైతులకు ఎరువుల కష్టాలే నెలకొన్నాయన్నారు. బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారంటూ ప్రశ్నించారు. మరోవైపు తాజాగా ఉల్లి, చీనీ, మినుము ధరలు కూడా పతనమై రైతులు లబోదిబో మంటున్నా పట్టించుకోక పోవడం దారుణమన్నారు జగన్ రెడ్డి.
YS Jagan Slams CM Chandrababu
పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీసం చలనం లేదు ఎందుకంటూ ప్రశ్నించారు . ఏటా ఏ సీజన్లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి, ఎరువులు ఎంత పంపిణీ చేయాలన్న దానిపై ప్రతిఏటా ప్రభుత్వంలో జరిగే కసరత్తే కదా. మరి యూరియా సమస్య ఎందుకు వచ్చింది? ఐదేళ్ల మా పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదన్నది వాస్తవం కాదా? ఇవాళ మీరు వైఫల్యం చెందారంటే ప్రభుత్వం అనేది సరిగ్గా పని చేయడం లేదని తేలి పోయందన్నారు. ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు జగన్ రెడ్డి. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు నల్లబజారుకు తరలించి, వాటిని బ్లాక్ చేసి, బస్తా యూరియా రేటు రూ.267లు అయితే, దీనికి మరో రూ.200లు అధికంగా అమ్ముకుంటున్నారని వాపోయారు. అక్రమ నిల్వలపై తనిఖీల్లేవు, ఎవ్వరిమీదా చర్యల్లేవన్నారు.
Also Read : CM Chandrababu Fired YS Jagan : ప్రతిపక్ష హోదా ప్రభుత్వం కాదు ప్రజలిస్తారు
















