EC : ఢిల్లీ – బీహార్ సర్ వివాదానికి తెర దించే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం (EC). ముసాయిదా జాబితాలో తొలగించబడిన ఓటర్ల డేటాను అప్లోడ్ చేసినట్లు ఈసీ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టుకు తెలిపింది. త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై కీలకమైన విచారణకు ఒక రోజు ముందు, భారత ఎన్నికల కమిషన్ తొలగించబడిన పేర్లను బహిర్గతం చేయడంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను పాటించినట్లు పేర్కొంది. ఈ మేరకు స్టేటస్ రిపోర్ట్ను దాఖలు చేసింది.
EC Key Comments on Deleted Voters
ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు కనిపించని దాదాపు 65 లక్షల మంది వ్యక్తుల బూత్ల వారీగా జాబితాను బీహార్ రాష్ట్రంలోని 38 జిల్లా ఎన్నికల అధికారుల వెబ్సైట్లో ప్రచురించారు, వారు ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చబడక పోవడానికి గల కారణాలను, అంటే, అది మరణం, సాధారణ నివాసాన్ని మార్చడం లేదా నకిలీ ఎంట్రీలు కారణంగా వాటిని పేర్కొన్నట్లు తెలిపింది పోల్ బాడీ తొలగించబడిన పేర్లతో కూడిన జాబితాను బీహార్ అంతటా పంచాయతీ భవనాలు, బ్లాక్ డెవలప్మెంట్ కార్యాలయాలు, పంచాయతీ అధికారి కార్యాలయాలలో కూడా ప్రదర్శించినట్లు పేర్కొంది.
బూత్ లెవల్ ఆఫీసర్లు , బూత్ లెవల్ అసిస్టెంట్లు కూడా జాబితాను కలిగి ఉన్నారని, నివాసితులు తమను చేర్చక పోవడానికి గల కారణాలను తనిఖీ చేయడంలో సహాయ పడతారని పోల్ బాడీ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ప్రజలకు అవగాహన కల్పించడానికి, డీఈఓల అధికారిక ఖాతాలతో సహా వార్తాపత్రికలు, రేడియో, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా జాబితా కు సంబంధించి ఆన్లైన్ , ఆఫ్లైన్ లభ్యతను ప్రజలకు తెలియజేసే విస్తృత ప్రచార ప్రచారాన్ని చేపట్టినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
Also Read : Saamana Fired on Amit Shah : అమిత్ షాపై ‘సామ్నా’ కన్నెర్ర















