DK Shivakumar : బెంగళూరు – బెంగళూరులో తాజాగా చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar). అక్రమ భవనాల నిర్మాణాలు చేపట్టడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వాపోయారు. డిప్యూటీ సీఎంతో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ . విద్యుత్ లోపం వల్లే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని చెప్పారు. బెంగళూరులోని నాగర్తపేటలోని ప్లాస్టిక్ వస్తువుల తయారీ యూనిట్లో అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశం నుండి అగ్నిమాపక సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు బాధితుడి మృతదేహాన్ని రక్షించారు.
DK Shivakumar Shocking Comments
బెంగళూరులోని నాగరత్పేటలో రాజస్థాన్కు చెందిన ఐదుగురు వ్యక్తుల ప్రాణాలను బలిగొన్న అగ్నిప్రమాదానికి అక్రమ భవనాల యజమానులే కారణమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఆదివారం ఆరోపించారు. వెంటనే ఇలాంటి నిర్మాణాలను ఆపాలని లేక పోతే కూల్చివేతను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అలాగే ప్రతి బాధితుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం కూడా ప్రకటిస్తామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ అన్నారు. ఇది భవన యజమాని తప్పు. నేను అందరికీ నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ ఉన్న భవనాలన్నీ అక్రమ భవనాలు ఉన్నాయన్నారు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. అయితే ఈ ఘటన జరగడం అత్యంత బాధాకరమన్నారు.
Also Read : Suryakumar Yadav Growth : సూర్య కుమార్ యాదవ్ ఫిట్ నెస్ ఓకే
















