చెన్నై : తమిళనాడు సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. భద్రతా చర్యలలో భాగంగా తమిళనాడు పాఠశాలలకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు వేయనున్నట్లు ప్రకటించింది . రాబోయే ఐదేళ్లపాటు తమిళనాడులోని పాఠశాల భవనాలను అసురక్షితమైనవి , ఉపయోగించలేని వాటికి ఎరుపు , మరమ్మతులు అవసరమైన వాటికి పసుపు , నిర్మాణపరంగా సురక్షితమైనవిగా భావించిన వాటికి ఆకుపచ్చ అని కేటగిరీలు నిర్ణయించారు. ఈ సందర్బంగా ఇవాళ జరిగిన తమిళనాడు అసెంబ్లీలో మంత్రి ఆదావ్ అర్జున ఈ కలర్ కోడ్ గురించి కీలక ప్రకటన చేశారు.
జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం ముఖ్యంగా వర్షాకాలానికి ముందు విద్యార్థుల భద్రతను నిర్ధారించడానికి పాఠశాల భవనాల కోసం మూడు అంచెల కలర్-కోడెడ్ భద్రతా వ్యవస్థను ప్రవేశ పెట్టనుంది. భవనాల నిర్మాణ స్థిరత్వం ఆధారంగా వాటిని ఎరుపు, పసుపు లేదా ఆకుపచ్చగా వర్గీకరిస్తారని ప్రజా పనుల శాఖ మంత్రి ఆదావ్ అర్జున తెలిపారు.పాఠశాల భవనాల పరిస్థితిపై ఆందోళనలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ, పాఠశాల విద్యా శాఖ మధ్య మరింత సన్నిహిత సమన్వయం అవసరం నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల భవనాలలో భద్రతా తనిఖీలు నిర్వహించి, ఆ అంచనా ఆధారంగా స్థిరత్వ ధృవీకరణ పత్రాలను జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు ఆధవ అర్జున.

















