CM Siddaramaiah : కర్ణాటక : ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై (CM Siddaramaiah) అవమానకరమైన కామెంట్స్ కు గాను సోషల్ మీడియాపై హ్యాండిల్స్ పై ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. బెంగళూరులోని సైబర్ క్రైమ్ పోలీసులు వజ్రోత్సవ కార్యక్రమంలో సిద్ధరామయ్య వైరల్ వీడియోకు సంబంధించిన దుర్వినియోగ పోస్ట్లను పర్యవేక్షించిన తర్వాత కేసు నమోదు చేశారు . సిద్ధరామయ్య కన్నడ వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో ఆయనపై అవమానకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేసినందుకు అనేక సోషల్ మీడియా ఖాతాలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
People Shocking Comments CM Siddaramaiah
కొన్ని మీడియా హ్యాండిల్స్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఈ విషయం సోషల్ మీడియా పర్యవేక్షణ విభాగానికి తెలియగానే సైబర్ క్రైమ్ పోలీసులు సెప్టెంబర్ 3న స్వయంగా కేసు నమోదు చేశారని వారు తెలిపారు. ఈ విషయంలో మేము కేసు నమోదు చేశామన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్-2) రాజా ఇమామ్ ఖాసిం . ఇటీవల జరిగిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ వజ్రోత్సవ వేడుకలో సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ కావడంతో ఆయనపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తీవ్ర విమర్శలు గుప్పించాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సహా వేదికపై ఉన్న వారిని ఆయన కన్నడ భాషలో ప్రసంగిస్తూ కన్నడ తెలుసా అని అడుగుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియో వైరల్ కాగా పలువురు నెటిజన్లు ముఖ్యమంత్రిని అగౌరవంగా” వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Also Read : S Jaishankar Interesting Comments : అమెరికాతో బంధానికి భారత్ ప్రాధాన్యం : జై శంకర్
















