CM Revanth Reddy : హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ప్రజా పాలన వారోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ సందర్బంగా డిసెంబర్ 1 నుంచి పెద్ద ఎత్తున ఉత్సవాలు చేపట్టాలని పార్టీ శ్రేణులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆదేశించారు. ఈ సందర్బంగా తాను కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పర్యటన వివరాలను టీపీసీసీ ప్రకటించింది. ఈ మేరకు శనివారం కీలక ప్రకటన వెలువరించింది.
CM Revanth Reddy Key Comments
ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా మొత్తం ఆరు ఎంపిక చేసిన జిల్లాలలో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో పాల్గొంటారని పేర్కొంది. డిసెంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో , 2న ఖమ్మం జిల్లా లోని కొత్తగూడెంలో , 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో , 4న ఆదిలాబాద్ లో, 5న నర్సంపేటలో , 6న నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో నిర్వహించే సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్లు వెల్లడించింది టీపీసీసీ. ఈ మేరకు ఆయా జిల్లాల అధ్యక్షులు ఏర్పాట్లు చేయాలిన ఆదేశించింది.
ఇదిలా ఉండగా తాజాగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది సీఎం సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ తరపున నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో ఈ గెలుపు ఊపును కొనసాగించేందుకు ప్రజా వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ ఏ మేరకు ఏర్పాట్లు చేయడంపై ఫోకస్ పెట్టారు.
Also Read : CM Chandrababu Clear Instructions : రోడ్డు ప్రమాదం సీఎం చంద్రబాబు సంతాపం

















