CM Revanth Reddy : హైదరాబాద్ : ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న పిల్లలకు తీపి కబురు చెప్పింది సర్కార్. రాష్ట్రంలో తమమిళనాడులో ప్రవేశ పెట్టిన అల్పాహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ సందర్బంగా
ప్రగతిశీల సంక్షేమ పథకాలను అమలు చేసినందుకు స్టాలిన్ను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులను గుర్తించడమే కాకుండా అభ్యాస ఫలితాలను మెరుగు పరచడంలో ఉపాధ్యాయులు, స్వచ్చంధ సంస్థల సహకారాన్ని కూడా గౌరవిస్తాయని నొక్కి చెప్పారు. తమిళనాడు మార్గదర్శక చొరవ నుండి ప్రేరణ పొందింది సర్కార్. 2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లోని పాఠశాల పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి అల్పాహార పథకంను ప్రారంభిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు.
CM Revanth Reddy will Start Breakfast Section in Govt Schools
తమిళనాడు ప్రభుత్వం విద్య, పోషకాహారం, సంక్షేమంలో సాధించిన విజయాలను ప్రదర్శించడానికి నిర్వహించిన కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ హాజరైనప్పుడు రేవంత్ రెడ్డి విద్య, పోషకాహారం, క్రీడలలో తమిళనాడు సాధించిన విజయాలను ప్రశంసించారు. దాని దశాబ్దాల నాటి పాఠశాల భోజన నమూనాను హైలైట్ చేశారు. ఉచిత అల్పాహారం, బాలికలు, బాలురు ఇద్దరికీ స్కాలర్షిప్లు, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు వంటి రాష్ట్ర చొరవలు దేశవ్యాప్తంగా ప్రతిరూపం కావడానికి అర్హమైనవని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. ఇటువంటి చొరవలు విద్యార్థి సాధకులను గుర్తించడమే కాకుండా అభ్యాస ఫలితాలను మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు సీఎం.
Also Read : Vijayawada Kanaka Durga Interesting Update : శ్రీ మహాలక్ష్మీ దేవిగా కనకదుర్గమ్మ

















