CM Chandrababu : విశాఖపట్నం : యూరోపియన్ యూనియన్ తో కీలకమైన అనుబంధం కలిగి ఉన్నామని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). గురువారం విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందు ఇండియా-యూరప్ బిజినెస్ రౌండ్టేబుల్లో ప్రసంగించారు. పరిశ్రమల ప్రతినిధులతో సంభాషించడం ఆనందంగా ఉందన్నారు సీఎం. గత రెండు దశాబ్దాలుగా భారతదేశంయూరోపియన్ యూనియన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం సానుకూలంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. భారతదేశం విస్తారమైన మార్కెట్కు ప్రవేశ ద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్, ఈ శాశ్వత సంబంధాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించడం గర్వంగా ఉందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
CM Chandrababu Comments
ఆయన తన ప్రసంగంలో గ్రీన్ ఎనర్జీ, మౌలిక సదుపాయాల నుండి సమాచార సాంకేతికత, ఆవిష్కరణల వరకు ఆంధ్రప్రదేశ్ నాయకుడిగా ఎదుగుతున్న కీలక రంగాలను నేను హైలైట్ చేశారు. వ్యాపారం చేయడంలో తమ అసమానమైన వేగం సామర్థ్యం, పారదర్శకత , పెట్టుబడిదారుల విశ్వాసానికి మా నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు సీఎం. ఈ సదస్సులో రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా ఆర్థిక మంత్రి గెవోర్గ్ పపోయన్; స్విట్జర్లాండ్లోని ఫైర్స్ట్జెన్ హోల్డింగ్ లిమిటెడ్ సీఐఓ క్లెమెన్స్ కోపెల్కిన్, ప్రొఫెసర్ లోహ్ముల్లర్, సీఐఐ డిజినేట్ ప్రెసిడెంట్ ఆర్. ముకుందన్, డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ , చైర్మన్ అమిత్ కళ్యాణి , యూరోపియన్ కౌన్సిల్ చైర్మన్ కూడా పాల్గొన్నారు.
Also Read : AP Growth – Marine Ecosystem : సముద్ర పర్యావరణ వ్యవస్థలో ఏపీ కీలకం


















