CJI Suryakant : న్యూఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. సీజేఐగా పని చేసిన జస్టిస్ బీఆర్ గవాయ్ ఇంటిని ఖాళీ చేసి తన స్వంత వాహనంలో వెళ్లి పోయారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐగా కొలువు తీరిన జస్టిస్ సూర్యకాంత్ (CJI Suryakant). అసాధారణ” పరిస్థితులలో మాత్రమే మౌఖిక కేసు అభ్యర్థనలు స్వీకరిస్తామన్నారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సీజేఐగా తన మొదటి రోజు దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన విచారణలో 17 కేసులను విచారించింది. ఇదిలా ఉండగా ఆయన కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. కొత్త విధాన పరమైన నియమాన్ని నిర్దేశించారు, అత్యవసర జాబితా కోసం కేసులను ప్రస్తావించడం రాత పూర్వకంగా చేయాలని స్పష్టం చేశారు.
CJI Suryakant Growth
మరణశిక్ష, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అసాధారణ పరిస్థితులలో మాత్రమే మౌఖిక అభ్యర్థనలను స్వీకరించాలని పేర్కొన్నారు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్. రాష్ట్రపతి భవన్లో దేవుని పేరు మీద హిందీలో ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే జస్టిస్ కాంత్ అధికారికంగా 53వ భారత దేశ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టుకు సీజేఐగా తొలిసారిగా చేరుకున్న ఆయన, కోర్టు ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత ఆయన హెరిటేజ్ కోర్టు రూమ్ నంబర్ వన్లో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి అధ్యక్షత వహించారు. విచారణ ప్రారంభమైన వెంటనే హిమాచల్ ప్రదేశ్ ఒక ప్రైవేట్ సంస్థకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్పై సీజేఐ తీర్పు ప్రకటించారు.
Also Read : Pawan Kalyan Strong Observation : అభివృద్ది పనులు పరిశీలించిన పవన్ కళ్యాణ్

















