కోల్ కతా : టీఎంసీ నాయకురాలు, ఎంపీ సయోని ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీని ఏకి పారేశారు. కావాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. వారి ఆటలు సాగవని, పప్పులు ఉడకవని అన్నారు. బిజెపికి మనం ఇవ్వాల్సిన ఏకైక సందేశం ‘ఖేలా హోబే’. 2026లో మమతా బెనర్జీ నాల్గవసారి బెంగాల్ను పాలించ బోతున్నారని అన్నారు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆమెతో ఉన్నారు .ఆమె ఇప్పటి వరకు అతిపెద్ద తీర్పులలో ఒకటిగా గెలవబోతోందని చెప్పారు.
సస్పెండ్ చేయబడిన టిఎంసి ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ బెల్దంగాలో వేసిన బాబ్రీ మసీదు శంకుస్థాపనపై, ఆమె ఇలా అన్నారు. ఎవరైనా గుడి నిర్మించవచ్చు, ఎవరైనా మసీదు నిర్మించవచ్చు, కానీ దాని వెనుక ఎవరైనా మతపరమైన అశాంతిని సృష్టించడం ఉద్దేశం అయితే, వారు బిజెపి నుండి నిధులు పొందుతున్నారని భావించాల్సి ఉంటుందన్నారు. బెంగాల్లో శాంతి భద్రతలను దెబ్బ తీసేందుకు బిజెపి వారిని ప్రోత్సహిస్తోందని అందరికీ తెలుసని సంచలన ఆరోపణలు చేశారు.
