Dwivedi : ఢిల్లీ : భారత దేశ ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్ తో జరిగిన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ సత్తా ఏమిటో దాయాదికి తెలిసి వచ్చిందన్నారు. అంతే కాకుండా యావత్ ప్రపంచం మన సత్తాను , శక్తిని చూసి విస్తు పోయిందన్నారు. ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఒక్కటే ఉందని, అది భారత వైమానిక రంగమేనని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఏనాడూ ఊహించ లేదని భారత్ ఈ రకంగా దాడికి పాల్పడుతుందని అన్నారు. న్యూఢిల్లీలోని హోటల్ తాజ్ ప్యాలెస్లో మంళవారం జరిగిన 52వ జాతీయ నిర్వహణ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Dwivedi) పాల్గొని ప్రసంగించారు.
Army Chief General Upendra Dwivedi Key Comments
ఏ యుద్ధభూమిలో నైనా భూ బలగాల ప్రాధాన్యతను నొక్కి చెప్పారు ఉపేంద్ర ద్వివేది. భారతదేశ సందర్భంలో భూమిపై ఆధిపత్యం విజయ కరెన్సీగా ఉంటుందని అన్నారు. గత నెలలో ఉక్రెయిన్ వివాదంపై అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , రష్యన్ కౌంటర్ వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన శిఖరాగ్ర చర్చలను ప్రస్తావించారు. ఇద్దరు అధ్యక్షుల మధ్య జరిగిన అలాస్కా సమావేశానికి మీరు తిరిగి వెళ్ళినప్పుడు, వారు ఎంత భూమి చేతులు మారాలి అని చర్చించారని తెలిపారు ద్వివేది.
ఆపరేషన్ సిందూర్ మరోసారి వైమానిక శక్తి ప్రాధాన్యతను స్థాపించిందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి. సింగ్ చెప్పిన రెండు వారాల తర్వాత ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు వచ్చాయి. తన వ్యాఖ్యలలో యుద్ధం మారుతున్న స్వభావం, కొత్తగా, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ప్రవేశ పెట్టడంలో భారత సైన్యం ఎలా పరివర్తనాత్మక మార్పులను చేపడుతుందో కూడా ఆర్మీ చీఫ్ విస్తృతంగా వివరించారు.
Also Read : Minister Atchannaidu Interesting Update : ఏపీకి 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా

















