Pankaj Chaudhary : ఢిల్లీ – పార్లమెంట్ లో కీలక ప్రకటన చేశారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి. ఆర్థిక చట్టం 2025 కొత్త పన్ను విధానంలో గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తుందన్నారు. కొత్త పన్ను విధానంలో కొత్త స్లాబ్లు, పన్ను రేటు ప్రాముఖ్యత వహిస్తుందన్నారు. దేశంలోని శ్రామిక , మధ్యతరగతి జనాభాపై ప్రత్యక్ష పన్నుల అదనపు భారం లేకుండా ఉండేలా న్యాయమైన, సమానమైన ప్రత్యక్ష పన్నుల వ్యవస్థను సృష్టించడంలో ఈ కొత్త చర్యలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు.
Pankaj Chaudhary Key Comments
అంతే కాకుండా అన్ని పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చేలా బోర్డు అంతటా స్లాబ్లు , రేట్లు మార్చడం జరిగిందన్నారు. కొత్త నిర్మాణం మధ్యతరగతి పన్నులను గణనీయంగా తగ్గిస్తుందన్నారు. గృహ వినియోగం, పొదుపు, పెట్టుబడిని పెంచుతుందని ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆర్థిక చట్టం, 2025, ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 87A కింద పన్ను రాయితీని క్లెయిమ్ చేయడానికి ఆదాయ పరిమితిని రూ. 7 లక్షల నుండి రూ. 12 లక్షలకు పెంచడం జరిగిందన్నారు పంకజ్ చౌదరి (Pankaj Chaudhary). అంతే కాకుండా గరిష్ట రాయితీ మొత్తాన్ని రూ. 25,000 నుండి రూ. 60,000కు పెంచిందన్నారు.
కొత్త పన్ను విధానంలో గతంలో అందించిన ఉపశమనం రూ. 12,00,000 కంటే స్వల్పంగా ఎక్కువ ఆదాయం ఉన్నవారికి కూడా వర్తిస్తుందని మంత్రి తెలియజేశారు. దేశీయ వినియోగం, ఆర్థిక వృద్ధిపై పన్నుల విషయంలో ఈ సంస్కరణల దీర్ఘకాలిక ప్రభావాన్ని పర్యవేక్షించడానికి నిర్దిష్ట లేదా ప్రత్యేక చర్యలు తీసుకోలేదన్నారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు సాధారణ పౌరులు, చిన్న వ్యాపారాలకు పన్నులను దాఖలు చేయడాన్ని సులభతరం చేస్తుందన్నారు.
Also Read : BJP Fired on Rahul Gandhi : సుప్రీం తీర్పు రాహుల్ కు చెంపపెట్టు


















