BJP : చైనా దురాక్రమణకు పాల్పడుతోందంటూ పదే పదే కామెంట్స్ చేయడంపై ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో మండిపడింది సుప్రీంకోర్టు. ఈ మేరకు పార్లమెంట్ లో ప్రస్తావించాలని, కానీ సోషల్ మీడియా వేదికగా ఎలా ప్రస్తావిస్తారంటూ ప్రశ్నించింది. దీనిపై ఇంకా స్పందించ లేదు రాహుల్ గాంధీ. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఘాటు వ్యాఖ్యల నేపథ్యంపై తీవ్రంగా స్పందించింది భారతీయ జనతా పార్టీ (BJP) . ఈ మేరకు సోమవారం ఢిల్లీలో ఆ పార్టీ ప్రతినిధి గౌరవ్ భాటియా మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పదే పదే అణగదొక్కారని, భారత సాయుధ దళాలను నిరాశపరిచారని ఆరోపించారు. ఆయన పదే పదే రాజ్యాంగాన్ని అవమానిస్తూ వచ్చారని మండిపడ్డారు.
BJP Slams Rahul Gandhi
మన ధైర్య సాయుధ దళాల విశ్వాసాన్ని ఎవరైనా నాశనం చేస్తుంటే, అది రాహుల్ గాంధీయే అని చెప్పడం తప్పు కాదని అన్నారు భాటియా. భారత భూభాగాన్ని చైనా 2,000 చదరపు కిలోమీటర్లకు పైగా ఆక్రమించుకుందని కాంగ్రెస్ నాయకుడు చేసిన వాదనపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జోయ్మల్య బాగ్చిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా విమర్శించింది. ప్రత్యేకంగా తప్పుపట్టింది కూడా. మీరు నిజమైన భారతీయులైతే, మీరు ఇవన్నీ చెప్పిందని ఇకనైనా రాహుల్ గాంధీ మారాలని సూచించారు గౌరవ్ భాటియా. ఇదిలా ఉండగా భారత్ జోడో యాత్ర సందర్భంగా గాంధీ ఈ వాదన చేశారు. చైనా దళాలు అరుణాచల్ ప్రదేశ్లో భారత ఆర్మీ సైనికులను కొట్టివేస్తున్నాయంటూ ఆరోపించారు. డిసెంబర్ 9, 2022న తవాంగ్లో జరిగిన ఘర్షణను ప్రస్తావిస్తూ ఈ కామెంట్స్ చేశారు రాహుల్ గాంధీ.
Also Read : PM Kisan Shocking : వారికి పీఎం కిసాన్ బంద్..ఎందుకో తెలుసుకుందామా?


















