ED : తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించి దర్యాప్తులో ఉన్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారనే ఆరోపణలపై టెక్ దిగ్గజాలను విచారించేందుకు సిద్దమైంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) . టెక్ దిగ్గజాలు గూగుల్, మెటాకు నోటీసులు పంపింది, జూలై 21న వారిని ప్రశ్నించాలని సమన్లు జారీ చేసింది.
ED Notice to Google Meta
మనీలాండరింగ్, హవాలా లావాదేవీలకు సంబంధించి దర్యాప్తులో ఉన్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. విచారణ కొనసాగుతోంది. ఈ టెక్ ప్లాట్ఫారమ్లు ప్రముఖ ప్రకటనల స్లాట్లను అందించాయన, ఈ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫారమ్లకు లింక్ చేయబడిన వెబ్సైట్లను వాటి సంబంధిత ప్లాట్ఫారమ్లలో ఉంచడం ద్వారా ఆకర్షితులయ్యారని, మోస పోయారని పేర్కొంది ఈడీ. తద్వారా ఈ అక్రమ కార్యకలాపాల విస్తృత వ్యాప్తికి దోహద పడుతుందని ఈడీ ఆరోపించింది.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల పెద్ద నెట్వర్క్ను ఈడీ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ యాప్లలో చాలా వరకు అక్రమ జూదంలో పాల్గొంటూనే, తమను తాము ‘నైపుణ్య ఆధారిత ఆటలు’ అని చెప్పుకుంటూ అక్రమ బెట్టింగ్ను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించింది. ఈ ప్లాట్ఫారమ్లు కోట్లాది రూపాయల విలువైన అక్రమ నిధులను పొందారని భావిస్తోంది .
గత వారం, బెట్టింగ్ యాప్లను ఆమోదించినందుకు తెలుగు రాష్ట్రాల్లోని 29 మంది ప్రముఖులపై కేంద్ర దర్యాప్తు సంస్త కేసు నమోదు చేసింది. పబ్లిక్ జూదం చట్టం, 1867ను ఉల్లంఘించి, అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫారమ్లను ప్రోత్సహించినందుకు కేంద్ర ఏజెన్సీ 29 మంది నటులు, ప్రభావశీలులు, యూట్యూబర్లపై ECIR దాఖలు చేసింది. సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, ప్రణిత సుభాష్, మంచు లక్ష్మి, మరియు అనన్య నాగేళ్లపై కేసు నమోదు చేసింది.
శ్రీముఖి, శ్యామల, వర్షిణి సౌందరరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పాండు, పద్మావతి, హర్ష సాయి , బయ్యా సన్నీ యాదవ్ వంటి టీవీ నటులు, టీవీ హోస్ట్లు, సోషల్ మీడియా ప్రభావశీలుల పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి.
Also Read : Hero Pawan-Hari Hara Veera Mallu Price Hike : హరి హర వీరమల్లు టికెట్ ధరలు భారీగా పెంపు


















