Ashwath : తమిళ సినీ దర్శకుడు అశ్వత్ మారిముత్తు(Ashwath) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్బంగా టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబుపై తన ప్రేమను వ్యక్తం చేశాడు. తన కెరీర్ లో ఒక్కసారైనా ప్రిన్స్ తో సినిమా చేయాలని ఉందన్నాడు. ఎందుకంటే తను డైరెక్టర్స్ హీరో అంటూ పేర్కొన్నాడు. ఆయన హావభావాలు, నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాడు. తనకు గనుక ఛాన్స్ ఇస్తే సినిమా తీస్తానంటూ ప్రకటించాడు.
Director Ashwath Marimuthu Comment
ఇదిలా ఉండగా ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. తను ఆస్కార్ అవార్డు గ్రహీత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ29 మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్ర నటిస్తోంది. ప్రతి నాయకుడి పాత్రలో మలయాళంకు చెందిన ఫాజిల్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం తమిళ సినీ దర్శకుడు మారిముత్తు ప్రిన్స్ పై చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేపాయి. మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం లో నటించాడు. ఇందులో శ్రీలీల కీలక పాత్రలో నటించింది.
Also Read : Beauty Movie : ‘బ్యూటీ’ఫుల్ టీజర్ అదుర్స్