AP Govt : విశాఖపట్నం : ఏపీలో భారీ ఎత్తున ఇన్వెస్ట్ మెంట్ ప్రకటించింది. ప్రముఖ దిగ్గజ కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరమాండల్ ఇంటర్నేషనల్ తో రూ. 2,000 కోట్ల అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది, ఇది కంపెనీ ధృవీకరించబడిన ప్రాజెక్టులు రాష్ట్రంలో కొనసాగుతున్న పెట్టుబడి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ సందర్భంగా చైర్మన్ అరుణ్ అలగప్పన్ , కోరమాండల్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శంకర్ సుబ్రమణియన్ కూడా చేరడం నాకు చాలా ఆనందంగా ఉందని ప్రకటించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
AP Govt Gets Huge Investments
ఆంధ్రప్రదేశ్ (AP Govt) లో అతిపెద్ద ఎరువుల కర్మాగారాన్ని నిర్వహిస్తోంది కోరమాండల్, ఎరువులు, ఫాస్ఫేట్ ఆధారిత ప్రత్యేక రసాయనాలు , ఈవీ ఇంటర్మీడియట్లపై దృష్టి సారించి 500–1,000 ఎకరాల పోర్ట్ ఆధారిత పారిశ్రామిక సముదాయాన్ని అభివృద్ధి చేస్తుండడం పట్ల సంతోషంగా ఉందన్నారు సీఎం. డ్రోన్ ఉత్పత్తి కోసం డ్రోన్ సిటీలో పెట్టుబడి పెట్టాలని, పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం, సామర్థ్యాన్ని మెరుగు పరచడం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ-సాంకేతిక భవిష్యత్తును బలోపేతం చేయడం లక్ష్యంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులపై సహకరించాలని తాను కోరమాండల్ ఇంటర్నేషనల్ కంపెనీ నిర్వాహకులను కోరానని చెప్పారు. భారీ ఎత్తున పెట్టుబడి పెట్టడం పట్ల ధన్యవాదాలు తెలిపారు ప్రత్యేకంగా సీఎం.
Also Read : CM Chandrababu Important Update : రామాయపట్నంలో ఫర్నీచర్ సిటీ


















