Minister Atchannaidu : అమరావతి : రాష్ట్ర అభివృద్దిలో సహకార రంగం కీలకమైన పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). అణగారిన వర్గాలను ఉద్ధరించడానికి సూపర్ సిక్స్ పథకాలను తీసుకు వచ్చామన్నారు. ప్రధానంగా ప్రభుత్వం గ్రామీణ సాధికారతపై ఫోకస్ పెట్టందని చెప్పారు. తుఫాను మంథా ప్రభావం కారణంగా కోనసీమ జిల్లాలో వరి ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని తెలిపారు. అమలాపురంలో జరిగిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఖరీఫ్ సీజన్లో 4.3 లక్షల టన్నుల దిగుబడి అంచనా వేయబడిందని చెప్పారు. అది 3.57 లక్షల టన్నులకు తగ్గవచ్చని పేర్కొన్నారు అచ్చెన్నాయుడు. కేంద్ర బృందం త్వరలో జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తుందని వెల్లడించారు.
Minister Atchannaidu Comments
రాయవరం మండలం కూర్మపురం గ్రామంలోని వట్టికూటి శేషమ్మ ప్రాథమిక వ్యవసాయ సహకార క్రెడిట్ సొసైటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అచ్చన్నాయుడు పాల్గొని ప్రసంగించారు. రైతులకు మద్దతు ఇవ్వడానికి సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గ్రామీణాభివృద్ధి నిధుల కిందరూ. 65 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ భవనం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు అచ్చెన్నాయుడు. రాష్ట్ర ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నిరుపేదలకు మేలు చేకూర్చేలా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వట్టికూటి వీరన్న చౌదరి, జిల్లా సహకార అధికారి రాధాకృష్ణ తదితరులు హాజరయ్యారు.
Also Read : Minister Kondapalli – AP Growth : ఎంఎస్ఎంఈల హబ్ గా ఆంధ్రప్రదేశ్


















