Prasanth Kishore : బీహార్ : ప్రముఖ భారతీయ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా జన్ సురాజ్ విశ్వసనీయతను బిజెపి నాయకుడు సంజయ్ జైస్వాల్ ప్రశ్నించడంపై తీవ్రంగా స్పందించాడు. ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను అబద్దాలు చెప్పనని, చిల్లర రాజకీయాలు చేయనంటూ స్పష్టం చేశాడు.
రాజకీయ నాయకుడిగా మారిన రాజకీయవేత్త ప్రశాంత్ కిషోర్ (Prasanth Kishore) అగియాన్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చార్పోఖారి బ్లాక్ ఆఫీస్ గ్రౌండ్లో జరిగిన జన సభ సందర్భంగా బిజెపి, ఆర్జేడీ నాయకులపై తన దాడికి మరింత పదును పెట్టారు. కీలకమైన బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన పార్టీ కోసం మైదానాన్ని సిద్ధం చేయడానికి ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం బీహార్ బద్లావ్ యాత్రలో ఉన్నారు.
Prasanth Kishore key Comments
ర్యాలీలో ప్రసంగించిన అనంతరం ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడారు. బిజెపి ఎంపి సంజయ్ జైస్వాల్పై నిప్పులు చెరిగారు. ఈ సందర్బంగా ఆయన ఓ కథ చెప్పారు. ఒక నక్క చని పోబోతున్నప్పుడు, అది నగరం వైపు పరిగెత్తుతుంది. సంజయ్ జైస్వాల్ వంటి నాయకులకు చెడు రోజులు వచ్చినప్పుడు, వారు మనలాంటి వారితో పోరాడటం ప్రారంభిస్తారు. ప్రస్తుతం తను దూకుడు పెంచాడని, కానీ అది కొద్ది సేపు మాత్రమే ఉంటుందన్నాడు ప్రశాంత్ కిషోర్.
ఎంపీకి సంబంధించిన అక్రమాల గురించి ఏకరవు పెట్టాడు. తన జీవిత చరిత్ర తెరిచిన పుస్తకం లాంటిదన్నాడు. తను ఎన్ని జన్మలు ఎత్తినా సరే జైలుకు పంపించ లేడన్నాడు. తన పార్టీ బీహార్, ఢిల్లీలో ఉంది. ఇదిలా ఉండగా జన సురక్ష పార్టీకి నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయో చెప్పాలన్నాడు ఎంపీ జైశ్వాల్. మరో వైపు ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్ చేసిన పూర్ణియా పర్యటనను కూడా కిషోర్ విమర్శించారు, ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృధా చేస్తోందని ఆరోపించారు.
Also Read : FDI Global Growth : ఇండియన్ కంపెనీల గ్లోబల్ విస్తరణలో పన్ను స్వర్గాల ప్రాధాన్యం


















