Shilpa Shetty : ముంబై : బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, భర్త రాజ్ కుంద్రాలకు కోలుకోలేని షాక్ తగిలింది. ఈ మేరకు ముంబై పోలీసులు రూ. 60 కోట్ల మోసం కేసులో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బెస్ట్ డీల్ టీవీ నుండి దాదాపు రూ.60 కోట్లను వ్యక్తిగత ఉపయోగం కోసం మళ్లించారని శిల్పా శెట్టి (Shilpa Shetty), రాజ్ కుంద్రాపై ఆరోపణలు ఉన్నాయి.
నగర పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఈ జంట తరచుగా అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అందుకే ఎల్ఓసీ జారీ చేయాల్సి వచ్చిందన్నారు పోలీసులు.
Mumbai Police Shocking to Shilpa Shetty and Her Husband
రూ. 60 కోట్ల మేర మోసం చేశారంటూ జుహు పోలీస్ స్టేషన్లో శిల్పా శెట్టి (Shilpa Shetty), రాజ్ కుంద్రాపై కేసు నమోదు చేశారు, రుణం, పెట్టుబడి ఒప్పందంలో వారు ఒక వ్యాపారవేత్తను దాదాపు రూ. 60 కోట్లకు పైగా మోసం చేశారని తెలిపారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త దీపక్ కొఠారి 2015, 2023 మధ్య వ్యాపార విస్తరణ కోసం ఉద్దేశించిన నిధులను వ్యక్తిగత ఉపయోగం కోసం మళ్లించారని భార్య భర్తలపై ఫిర్యాదు చేశారు. లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ గా ఉన్నారు కొఠారి. రాజేష్ ఆర్య ద్వారా ఈ జంటకు తనను పరిచయం చేసుకున్నట్లు చెప్పారు. కొఠారి ప్రకారం, ఈ జంట మొదట 12 శాతం వడ్డీకి రూ. 75 కోట్ల రుణం కోరింది, కానీ తరువాత నెలవారీ రాబడి , అసలు తిరిగి చెల్లింపు హామీలతో పన్నును తగ్గించడానికి ‘పెట్టుబడి’గా నిధులను మళ్లించమని ఒప్పించినట్లు తెలిపాడు.
ఈ హామీలపై ఆధారపడి కొఠారి ఏప్రిల్ 2015లో షేర్ సబ్స్క్రిప్షన్ ఒప్పందం కింద రూ. 31.95 కోట్లు , 2015 సెప్టెంబర్లో అనుబంధ ఒప్పందం ద్వారా అదనంగా రూ. 28.53 కోట్లు బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తాలను కంపెనీ హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ ఖాతాలకు జమ చేశారు . సెప్టెంబర్ 2016లో శిల్పా శెట్టి సంస్థ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. 2017 నాటికి, మరొక ఒప్పందంలో డిఫాల్ట్ అయినందుకు బెస్ట్ డీల్ టీవీపై దివాలా చర్యలు ప్రారంభించబడ్డాయి. కాగా ఆర్య ద్వారా నిధులను తిరిగి పొందడానికి పదేపదే చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని కొఠారి ఆరోపించారు. దీంతో ముంబై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 403, 406, 34 కింద FIR నమోదు చేశారు.
Also Read : PM Kisan Interesting Update : పీఎం కిసాన్ 21వ విడతపై కేంద్రం కీలక అప్డేట్



















