CM Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ జపం చేస్తున్నారు. ఇది పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్పా మరోటి కాదంటున్నారు గులాబీ నేతలు. అయినా ఎక్కడా తగ్గడం లేదు సీఎం. తాజాగా మరో కీలక అప్ డేట్ వచ్చింది. ఫ్యూచర్ సిటీని జాతీయ రహదారులను కలిపేలా చేయాలని చూస్తోంది సర్కార్. హైవేలను అనుసంధానించడానికి, పరిశ్రమలను పెంచడానికి , రద్దీని తగ్గించడానికి ప్రయత్నం ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రధానంగా ఉన్న రహదారులు శ్రీశైలం హైవే ని, నాగార్జున సాగర్ రోడ్ తో కలుపుతూ ఫ్యూచర్ సిటీని రూపొందించనున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్ సీ డీఏ )పరిమితుల్లో అభివృద్ధి చేయబడుతున్న ఈ కారిడార్ కీలకమైన పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతుంది .
CM Revanth Reddy Key Comments
అంతే కాకుండా ప్రణాళికా బద్ధమైన పట్టణ-పారిశ్రామిక ప్రాంతంలో కీలకమైన క్రాస్-యాక్సిస్ను ఏర్పరుస్తుంది. ట్రంక్ రోడ్డు పారిశ్రామిక మండలాలు, లాజిస్టిక్స్ హబ్లు, నివాస పరిసరాలను కలుపుతుందని, తద్వారా సమతుల్య పట్టణ వృద్ధిని నిర్ధారిస్తుందని భావిస్తున్నారు. దక్షిణ గ్రోత్ కారిడార్ అంతటా బహుళ-మోడల్, హై-స్పీడ్ కనెక్టివిటీని మెరుగు పరుస్తుంది. అంతర్గత రద్దీని. ఇప్పటికే ఉన్న రోడ్డు నెట్వర్క్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతరాయం లేని ప్రయాణానికి డిజైన్లను ఖరారు చేశారు. కారిడార్ను భవిష్యత్తుకు సిద్ధంగా ఉంచడానికి భవిష్యత్ సామూహిక రవాణా వ్యవస్థలు ఇంటిగ్రేటెడ్ యుటిలిటీ మౌలిక సదుపాయాల కోసం నిబంధనలు డిజైన్లో నిర్మించ బడ్డాయి.
Also Read : CM Revanth Reddy Important Update : తెలుగు సినీ కార్మికుల సమ్మె విరమణ


















