Iran : ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో, అక్కడున్న భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది. యుద్ధ వాతావరణం ముసురుకున్న ఇరాన్ రాజధాని టెహ్రాన్ను వీడి, అక్కడి నుంచి అర్మేనియా సరిహద్దుకు చేరుకున్న 110 మంది భారతీయ విద్యార్థులు ఇప్పుడు స్వదేశానికి పయనమవుతున్నారు. ఈ విద్యార్థులను తీసుకొచ్చే విమానం బుధవారం రాత్రి 10:15 గంటలకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనుంది.
Indian Students Reach Delhi from Iran
ఈ విద్యార్థుల్లో 90 మంది జమ్మూ కశ్మీర్కు చెందినవారు ఉండటం విశేషం. వీరంతా మెడికల్ విద్యతో పాటు ఇతర వృత్తి కోర్సుల్లో ఇరాన్లో చదువుతున్నారు. ముఖ్యంగా, ఉర్మియా మెడికల్ యూనివర్సిటీలో ఎక్కువ మంది భారత విద్యార్థులు చదువుతున్నట్లు జమ్మూ అండ్ కశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలిపింది.
భద్రతా పరంగా ఇరాన్లో (Iran) పరిస్థితి వేడెక్కుతున్న నేపథ్యంలో, భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. అక్కడి భారత రాయబార కార్యాలయం దేశీయుల్ని బేస్ చేసి, ఒకవైపు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా, మరొకవైపు అత్యవసర పరిస్థితుల్లో వారి తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
ఈ నేపథ్యంలో అర్మేనియాకు చేరుకున్న విద్యార్థులను ప్రథమంగా ఖతార్ రాజధాని దోహాకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి విమానంలో న్యూఢిల్లీకి తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని జమ్మూ కశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ మీడియాకు వెల్లడించింది.
ప్రస్తుతం ఇరాన్లో (Iran) దాదాపు 4,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. వారిలో సగం మంది విద్యార్థులే. ఈ విద్యార్థులలో చాలామంది మెడికల్ చదువులు, ఇతర టెక్నికల్ కోర్సుల్లో భాగంగా వుంటున్నారు. వారందరికీ సహాయంగా భారత రాయబార కార్యాలయం నిత్యం సంబంధం పాటిస్తూ, అవసరమైన మద్దతు అందిస్తున్నదని కేంద్ర విదేశాంగ శాఖ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.
యుద్ధ భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్న విదేశాల్లోని భారతీయులకు ఈ తరలింపు కార్యక్రమం కొంత ఊరటనిచ్చే విషయం అని భావిస్తున్నారు. అవసరమైతే మరింత మంది భారతీయులను కూడా ఇలా స్టెప్-బై-స్టెప్ తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాచారం.
Also Read : Powerful F-35B Flight : 4 రోజుల గా తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో నిలిచిన బ్రిటన్ విమానం












