Taapsee Pannu: ఒలింపిక్స్‌ గ్యాలరీలో తాప్సీ, కోర్టులో మాథియాస్ సందడి !

ఒలింపిక్స్‌ గ్యాలరీలో తాప్సీ, కోర్టులో మాథియాస్ సందడి !

Hello Telugu - Taapsee Pannu

Taapsee Pannu: ఝుమ్మందినాదం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి… మొగుడు, మిస్టర్ ఫెర్ఫెక్ట్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన తాప్సీ పన్ను… ఆ తరువాత కోలీవుడ్ కి అటు నుండి అటే బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. బాలీవుడ్ లోని బడా హీరోలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైయింది తాప్సీ. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్‌ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీని తాప్సీ నటించిన హిట్ చిత్రం హసీన్ దిల్‌ రూబాకు సీక్వెల్‌గా తీసుకొస్తున్నారు. ఇందులో విక్రాంత్ మాస్సే, జిమ్మీ షెర్గిల్, సన్నీ కౌశల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 9 నుంచి నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Taapsee Pannu…

అయితే ఈ ఏడాది మార్చిలో తన ప్రియుడు మథియాస్ బో పెళ్లాడిన సంగతి తెలిసిందే. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినా మథియాస్‌ ప్రస్తుతం భారత జాతీయ బ్యాడ్మింటన్ జట్టుకు పురుషుల డబుల్స్ కోచ్‌ గా ఉన్నారు. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ గేమ్స్‌ తో బిజీగా ఉన్నారు. తాజాగా తాప్సీ సైతం పారిస్ చేరుకుంది. భారత టీమ్‌ తో పాటు భర్తకు మద్దతు తెలిపేందుకు పారిస్ చేరుకుంది. మాథియాస్ బ్యాట్మింటన్ కోర్టులో సందడి చేస్తుండగా… తాప్సీ(Taapsee Pannu) మాత్రం మువ్వన్నెల భారతీయ జెండా పట్టుకుని గ్యాలరీలో సందడి చేస్తుంది.

అయితే తాప్సీ పన్ను, తన భర్త మథియాస్ బో డెన్మార్క్‌లో కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. త్వరలోనే డెన్మార్క్ ఇంట్లో గృహప్రవేశం జరుగుతుందని తెలిపింది. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత తన భర్తతో పాటు డెన్మార్క్‌ లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తాప్సీ పేర్కొంది. సమ్మర్‌ లో డెన్మార్క్ ఎక్కువ సమయం ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చింది.

Also Read : Brahmastra 2 : బ్రహ్మాస్త్ర సీక్వెల్ కోసం పోటీ పడుతున్న బడా స్టార్స్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com