Rukmini Vasanth: హీరోయిన్‌ ‘రుక్మిణీ వసంత్‌’ ఇంట్లో విషాదం !

హీరోయిన్‌ 'రుక్మిణీ వసంత్‌' ఇంట్లో విషాదం !

Hello Telugu - Rukmini Vasanth

Rukmini Vasanth: ‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన కన్నడ కస్తూరి రుక్మిణీ వసంత్‌… ఇంట్లో విషాదం నెలకొంది. ఇదే విషయాన్ని తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది. ఒక సుదీర్ఘమైన లేఖతో ఆమె ఉద్వేగానికి గురైంది. తనకు ఎంతో ఇష్టమైన అమ్మమ్మ చనిపోయినట్లు ఆమె తెలిపారు.

Rukmini Vasanth…

ఆగష్టు 23 తెలవారుజామున తన అమ్మమ్మ చనిపోయినట్లు హీరోయిన్‌ రుక్మిణీ వసంత్‌ తెలిపారు. వయసు రిత్యా పలు అనారోగ్య సమస్యలతో ఆమె మరణించినట్లు తెలుస్తోంది. అయితే, తన అమ్మమ్మతో చాలా అనుబంధం ఉన్నట్లు చెప్పిన రుక్మిణీ చాలా ఎమోషనల్‌ అయింది. తన అమ్మమ్మతో ఉన్న పలు పాత జ్ఞాపకాలను ఆమె పంచుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

కన్నడ సినిమాలతో పాపులర్‌ అయిన రుక్మిణీ వసంత్‌ తెలుగులో కూడా పలు సినిమాల్లో ఛాన్స్‌ లు దక్కించుకుంది. విజయ్‌ దేవరకొండ- రవికిరణ్‌ కాంబినేషన్‌ లో వుస్తున్న ఒక ప్రాజెక్ట్‌లో ఆమెకు ఛాన్స్‌ వచ్చింది. ‘కాంతార: చాప్టర్‌ 1’ చిత్రంలో కూడా ఆమెకు ఛాన్స్‌ దక్కినట్లు సమాచారం.

Also Read : Nandamuri Balakrishna: మెగాస్టార్ కు బాలయ్య ప్రత్యేక ఆహ్వానం ! ఆ కార్యక్రమానికేనా !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com