Ram Charan: గ్రాండ్‌ గా ‘RC16’ పూజా కార్యక్రమం ! హాజరైన సినీ ప్రముఖులు !

గ్రాండ్‌ గా 'RC16' పూజా కార్యక్రమం ! హాజరైన సినీ ప్రముఖులు !

Hello Telugu - Ram Charan

Ram Charan: ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘RC16’ (వర్కింగ్ టైటిల్) తో తెరకెక్కబోయే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఉత్తరాంధ్రకు చెంది గ్రామీణ క్రీడ (రూరల్ స్పోర్ట్స్) ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తే జాన్వీ కపూర్ కపూర్ నటించగా… ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Ram Charan Movie Updates

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న రామ్ చరణ్(Ram Charan)… గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో ‘RC16’ పూజా కార్యక్రమం హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకులు శంకర్, సుకుమార్, నిర్మాతలు అల్లు అరవింద్, బోనీ కపూర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, జాన్వీ కపూర్, రామ్ చరణ్, ఉపాసన, చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌నివ్వగా… నిర్మాత బోనీ కపూర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. అగ్ర దర్శకుడు శంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత అల్లు అరవింద్‌ చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ ని అందజేశారు.

పూజా కార్యక్రమం అనంతరం రామ్‌చరణ్‌ మాట్లాడుతూ… ‘‘నేను.. జాన్వీ కలిసి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీమేక్‌లో నటించాలని చాలా మంది కోరుకున్నారు. మా కలయిక ఈ సినిమాతో నిజం కానుండడం చాలా ఆనందంగా ఉంది. బుచ్చిబాబు సానాకి సినిమా అంటే పిచ్చి. ‘రంగస్థలం’ కథని సుకుమార్‌ నలభై నిమిషాలు చెబితే, ఆ కథని రోజూ రెండేసి గంటలు చెప్పేవాడు బుచ్చిబాబు. తన సంకల్పంవల్లే ఇదంతా సాధ్యమైంది. ఎ.ఆర్‌.రెహమాన్‌తో నా కెరీర్‌లో ఇంత త్వరగా సినిమా చేస్తాననుకోలేదు. బుచ్చిబాబు రాసిన కథ నాకెంతో నచ్చింది… ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్‌టైన్‌ అవుతారని చెర్రీ అన్నారు’’ అన్నారు.

దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ ‘‘రామ్‌చరణ్‌(Ram Charan) ‘రంగస్థలం’ సినిమాకి నేను సహాయ దర్శకుడిగా పనిచేశా. నాపైన నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చారు. ఎ.ఆర్‌.రెహమాన్‌తో పనిచేయాలన్న నా కల నా రెండో సినిమాకే నెరవేరుతోంది. అందుకు కారణం మా గురువు సుకుమార్‌, కథానాయకుడు, నిర్మాతలే. మా అందరికీ మంచి సినిమా అవుతుంది’’ అన్నారు.

సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ మాట్లాడుతూ ‘‘బుచ్చిబాబు సానా ఆలోచనలు గొప్పగా ఉంటాయి. తను నన్ను కలిసినప్పుడు ఐదు సందర్భాలు చెప్పి, ఆ బాణీల గురించి వివరిస్తూ ఓ ఫైల్‌ ఇచ్చాడు. తనలోని ఆసక్తి చూసి ముచ్చటేసింది. ఇప్పటికే మూడు బాణీలు సిద్ధమయ్యాయి’’ అన్నారు. జాన్వీ కపూర్‌ మాట్లాడుతూ ‘‘నేను ఎంతగానో అభిమానించే ప్రముఖులందరితో కలిసి ఈ వేదికని పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. బుచ్చిబాబు కథని చెప్పిన విధానం చూసి సినిమా చేయాలనే నిర్ణయానికొచ్చా’’ అన్నారు. ‘‘హైదరాబాద్‌ నాకు రెండో ఇల్లులాంటిది. తెలుగులో సినిమాలు చేశా. మరిన్ని చేయాలనుకుంటున్నా. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ సినిమానీ హిందీలో రీమేక్‌ చేయాలనుకున్నా’’ అన్నారు ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌.

Also Read : Hanuman : ఓటీటీలోను టేబుల్ టాప్ లో ట్రెండ్ అవుతున్న హనుమాన్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com