Ram Charan : అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కు చరణ్ ఫ్యామిలీ కి ఆహ్వానం

అతిరధ మహారధులకు అయోధ్య నుంచి ఆహ్వానం

Hello Telugu - Ram Charan

Ram Charan : అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నెల 22న శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అయితే ఈ మహత్తర కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దేశీయ మరియు అంతర్జాతీయ రాజకీయాలు, చలనచిత్రం మరియు క్రీడలకు చెందిన ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.

Ram Charan Got Invitation from Ayodhya

సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులకు ఇప్పటికే అయోధ్య నుంచి ఆహ్వానాలు అందాయి. రజనీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, కంగనా రనౌత్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్, రణబీర్ కపూర్, అలియా భట్, ధనుష్ తదితరులకు శ్రీరామ జన్మభూమికి ఆహ్వానం అందింది.

తాజాగా రామ్ చరణ్ ఉపాసనకు అయోధ్య నుంచి ఆహ్వానం అందింది. హైదరాబాద్‌లోని రామ్‌చరణ్‌(Ram Charan) నివాసానికి వెళ్లిన ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత సునీల్‌ అంబేద్కర్‌ అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, రామ్ చరణ్ దంపతులు ఈసారి బెంగుళూరులో సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు. ఇందుకోసం రామ్ చరణ్ తన కూతురు క్లింకారాతో కలిసి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారు.రామ్ చరణ్ దంపతులకు ఇష్టమైన కుక్క కూడా ఉంది. ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Also Read : Kalyan Ram Devil: రెండువారాలకే ఓటీటీలోకి వస్తున్న కళ్యాణ్ రామ్ ‘డెవిల్‌’ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com