Nayanthara : హీరో ధనుష్ పై విరుచుకుపడ్డ ‘నయనతార’

2015లో 'నానుమ్ రౌడీ ధాన్'(నేను రౌడీనే) అనే చిత్రాన్ని నయనతార, విగ్నేష్ జంటగా ధనుష్ నిర్మించారు.

Hello Telugu - Nayanthara

Nayanthara : సౌతిండియా లేడి సూపర్ స్టార్ ‘నయనతార’ స్టార్ హీరో ధనుష్‌పై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ధనుష్‌కి బహిరంగ లేఖ రాశారు. ధనుష్(Dhanush) వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆమె తీవ్ర విమర్శలు చేశారు. “ఫ్యాన్స్‌కి సినిమా వేదికలపై నీతులు చెప్పే నీకు.. మిగతా తోటి ఆర్టిస్ట్స్‌తో ఎలా నడుచుకోవాలో తెలీదా” అంటూ మండిపడ్డారు. ఒక డాక్యుమెంటరీ రైట్స్ విషయంలో మొదలైన వీరిద్దరూ గొడవ ఇప్పుడు బహిరంగంగా రచ్చ చేస్తోంది.

Nayanthara Slams…

2015లో ‘నానుమ్ రౌడీ ధాన్'(నేను రౌడీనే) అనే చిత్రాన్ని నయనతార(Nayanthara), విగ్నేష్ జంటగా ధనుష్ నిర్మించారు. ఈ సినిమాతోనే ప్రేమలో పడ్డ నయనతార, విగ్నేష్ ఘనంగా పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ పెళ్లిని డాక్యుమెంటరిగా చిత్రీకరించి నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పుడో విడుదల చేయాల్సి ఉంది. కానీ.. తీవ్ర ఆలస్యం అయ్యింది. దీనికి ప్రధాన కారణం ధనుష్ అని తెలుస్తోంది. ఈ డాక్యుమెంటరీలో నయనతార జీవితంలో ఎంతో ప్రధానమైన ‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమా క్లిప్స్, లిరిక్స్ వాడుకునేందుకు ధనుష్ నిరాకరించాడు.

అలాగే ఈ డాక్యుమెంటరీ ట్రైలర్‌లో సినిమాలోని 3 సెకన్ల విజువల్స్ వాడుకున్నందుకు ధనుష్ రూ. 10 కోట్లు డిమాండ్ చేశాడట. దీంతో ఆమె ధనుష్‌పై తీవ్రంగా ఫైర్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్ అయినందుకు ధనుష్ సంతోషపడకుండా అసూయని పెంచుకున్నారని ఆమె ఆరోపించారు. “మేము సినిమా షూటింగ్‌లో మా పర్సనల్ కెమెరాలతో షూట్ చేసుకున్న ‘బిహేండ్ ది సీన్స్’ని కూడా వాడుకోకుండా మా జీవితాలపై పెత్తనం చెలాయించే హక్కు నీకు ఎక్కడిదంటూ” ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి, సోదరుల సహాయంతో ఇండస్ట్రీలో గొప్ప యాక్టర్‌గా ఎదిగిన మీకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇంత స్థాయికి చేరుకున్న మాపై మీరు ప్రవర్తిస్తున్న తీరు బాలేదని అన్నారు. ‘కేవలం ప్రేమని పంచండి’ అంటూ ఆమె లేఖ ముగించారు.

Also Read : Nara Rohit : హీరో నారా రోహిత్ తండ్రి కన్నుమూత

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com