INDW vs SAW : మలేషియా – కౌలాలంపూర్ వేదికగా ఆదివారం జరిగిన వుమెన్స్ అండర్ 19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ జట్టు అద్బుతమైన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టును 82 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం బరిలోకి దిగిన టీమిండియా 11.2 ఓవర్లలో కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
INDW vs SAW Under 19…
తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష 33 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లతో 44 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచింది. కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. బౌలింగ్ లోనూ ప్రతిభ చాటింది. 3 వికెట్లు తీసింది. ఇదిలా ఉండగా అంతకు ముందు బ్యాటింగ్ చేసిన సఫారీలు భారత మహిళల బౌలర్ల దెబ్బకు విల విలలాడింది.
నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌట్ అయ్యింది దక్షిణాఫ్రికా జట్టు. మికీ వాన్ ఒక్కరే టాప్ స్కోరర్ గా నిలిచింది. తను 23 రన్స్ చేసింది. విచిత్రం ఏమిటంటే ఆ జట్టులో నలుగురు ప్లేయర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టారు. గొంగడి త్రిష అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ సత్తా చాటింది. పరునిక , ఆయుష్ , వైష్ణవి తలో 2 వికెట్లు తీశారు. విశాఖపట్టణం కు చెందిన షబ్నం ఒక వికెట్ తీసింది.
టోర్నీలో అద్బుతమైన సెంచరీతో ఆకట్టుకున్న గొంగడి త్రిష ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది.
Also Read : Hero Balayya-Akhanda2:మహా శివ రాత్రికి అఖండ2 ఫస్ట్ లుక్